జనం ఆస్తులపై జగన్ కుట్ర
ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే అధికారికంగా దోచేందుకు కుట్ర పన్నింది. ‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో ప్రజల స్థలాలు, పొలాలు, భూములు తదితర ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కావలి, దుత్తలూరు, ఉదయగిరి, న్యూస్టుడే: ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే అధికారికంగా దోచేందుకు కుట్ర పన్నింది. ‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో ప్రజల స్థలాలు, పొలాలు, భూములు తదితర ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వారసత్వంగా సంక్రమించిన, పైసాపైసా కూడబెట్టుకుని కొనుగోలు చేసిన స్థలాలు, పొలాలు తమవే అని సదరు యజమానులే నిరూపించుకోవాల్సిన పరిస్థితిని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టంపై అన్నివర్గాల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
దుర్మార్గమైన చట్టం
-దామా అంకయ్య, జిల్లా కార్యదర్శి, నెల్లూరు, సీపీఐ
భూ యాజమాన్య హక్కు చట్టం దుర్మార్గం. పేద, మధ్యతరగతి వర్గాల వారు కష్టపడి సంపాదించుకున్న స్థిరాస్తికైనా, తరతరాలుగా వచ్చే వంశపారంపర్య భూములపై యాజమాన్య హక్కు కోల్పోవడం దారుణం. కొన్నాళ్లు ఆస్తుల పర్యవేక్షణ పట్టించుకోకపోతే పరులపాలయ్యే ప్రమాదం ఉంది. ఏ రాష్ట్రంలోనూ ఈ చట్టం అమలు చేసేందుకు ముఖ్యమంత్రులు సిద్ధంగా లేరు. ప్రధాని మోదీకి దాసోహమైన ముఖ్యమంత్రి జగన్ ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పూనుకోవడం అన్యాయం.
నిరక్షరాస్యులైతే ఇబ్బందికరమే
- దమ్ము దర్గాబాబు, జిల్లా అధ్యక్షులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం
వ్యవసాయ కార్మికులు, సన్న, చిన్నకారు, కౌలు రైతుల్లో చాలామంది నిరక్షరాస్యులు. వారు యాజమాన్య హక్కు కోల్పోయే దుస్థితి ఉంది. ఇప్పటివరకు ఉన్న భూ హక్కు పత్రాలు ఇకపై అక్కరకు రావు. కేవలం టైట్లింగ్ అథారిటీ అధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. రీసర్వేతో చాలా మంది పేద రైతులకే ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈచట్టం మరింత ప్రమాదకరం.
రాజకీయ పెత్తనానికి ప్రాధాన్యం
- కాకు వెంకటయ్య, రైతు సంఘం నాయకుడు
ఈ చట్టంతో ఏ ప్రభుత్వం ఉంటే... వారికి ఇష్టమొచ్చిన భూములను ప్రజల నుంచి లాక్కునే ప్రమాదం ఉంది. ఆస్తి వివాదాలు వచ్చినపుడు కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. తీర్పు, పెత్తనం అధికారులదే.
సీఎం అమలుచేయడం అమానుషం
-తన్నీరు మాల్యాద్రి, జిల్లా ఉపాధ్యక్షులు, వ్యవసాయ కార్మిక సంఘం
ఎంత నిరుపేద కుటుంబానికైనా కొద్దోగొప్పో భూమి ఉంటే భరోసా ఉంటుంది. వాటి హక్కు పత్రాలు వారింట ఉండకపోవడం దారుణం. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సీఎం జగన్ దీన్ని అమలు చేయడం అమానుషం.
నిరంతరం చూసుకోవాల్సిందే
- నరసింహారావు, రైతు, వరికుంటపాడు
ఈ చట్టంతో భూమి పత్రాలకు విలువ లేకుండా చేస్తున్నారు. నిరంతరం భూ రికార్డుల వివరాలు పరిశీలించుకోవాల్సిన పరిస్థితి తెస్తున్నారు. ఎవరైనా కబ్జా చేసి వారి పేరుతో రికార్డులు పుట్టించుకుని మూడేళ్లు గడిస్తే అసలైన యజమాని ఆ భూమిపై హక్కు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అన్యాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు