పురుడు పోస్తూ.. ప్రాణాలు నిలుపుతూ
గర్భిణులకు 108 సిబ్బంది ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ఫోన్ చేసిన వెంటనే వెళ్లి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నొప్పులు తీవ్రమైనా.. పరిస్థితి చేయిదాటుతున్నా 108 వాహనంలోనే పురుడుపోస్తున్నారు. అత్యవసర సమయంలో కాన్పులు చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందారు. వైద్యుల సూచనలు పాటిస్తూనే తల్లీబిడ్డలను సురక్షితంగా ఉంచుతున్నారు.
108 అంబులెన్సులోనే అత్యవసర చికిత్సలు
ప్రత్యేక శిక్షణతో చాకచక్యంగా
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం
108లో కాన్పు చేసి శిశువును అప్పగిస్తున్న సిబ్బంది
గర్భిణులకు 108 సిబ్బంది ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ఫోన్ చేసిన వెంటనే వెళ్లి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నొప్పులు తీవ్రమైనా.. పరిస్థితి చేయిదాటుతున్నా 108 వాహనంలోనే పురుడుపోస్తున్నారు. అత్యవసర సమయంలో కాన్పులు చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందారు. వైద్యుల సూచనలు పాటిస్తూనే తల్లీబిడ్డలను సురక్షితంగా ఉంచుతున్నారు.
పరిస్థితి చేయి దాటితే..
రోడ్డుప్రమాదాల్లో గాయపడిన వారి ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు నిలపడంతోపాటు.. పురిటినొప్పులు తీవ్రమై ప్రాణాపాయ స్థితిలో ఉండే గర్భిణులకు పురుడు పోస్తున్నారు. ఇందు కోసం వాహనంలో అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు, ఒక పైలెట్, డ్రైవర్ సేవలందిస్తున్నారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి చేయిదాటితే అప్పటికప్పుడు వాహనాన్ని నిలిపివేసి ప్రసవాలు చేస్తున్నారు. ఈ చికిత్సకు హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కాల్సెంటర్ ద్వారా వైద్యుల సూచనలు పాటిస్తూ తల్లీబిడ్డకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడుతున్నారు.
సౌకర్యాలు లేక వెతలు
సాధారణ కాన్పులకు అవకాశం లేని సమయంలో శస్త్రచికిత్స చేసేందుకు జిల్లాలో సరిపడా వసతులు లేవు. ప్రత్యేక స్త్రీ వైద్య నిపుణులు లేరు. అందుకు కావాల్సిన పరికరాలు, సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో సాధారణ కాన్పులయ్యే అవకాశమున్నా ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. అన్ని కేసులను ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారు. రక్తహీనత, పేగు మెడకు చుట్టుకుని ఉండటం, శిశువు కాళ్లు ముందుకు రావడం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఎదురైనప్పుడు సైతం 108 సిబ్బంది త్వరగా ఆసుపత్రులకు తరలించి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడుతున్నారు.
జాగ్రత్తలు పాటిస్తున్నాం
- అనిరుధ్, 108 జిల్లా సమన్వయకర్త , కామారెడ్డి
గర్భిణులను ఆసుపత్రికి తరలించే క్రమంలో పురిటినొప్పులు అధికమైతే అంబులెన్సులోనే ప్రసవాలు చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. కాల్సెంటర్ ద్వారా ప్రత్యేక వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. వారు అందిస్తున్న సేవలు ఎనలేనివి. ప్రసవం అనంతరం తల్లీబిడ్డను సమీప ఆసుపత్రుల్లో చేర్చుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?