logo

శుభకార్యానికి వచ్చి పాముకాటుకు గురై.. గర్భిణి మృతి

నాగిరెడ్డిపేట మండలం బంజార తండాకు చెందిన మూడు నెలల గర్భిణి మాలోత్‌ అశ్విని(19) ఆదివారం రాత్రి పాముకాటుకు గురై మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. అంకోల్‌ కొత్తబాది తండాకు చెందిన

Published : 24 May 2022 04:17 IST

అశ్విని

నాగిరెడ్డిపేట(లింగంపేట), న్యూస్‌టుడే: నాగిరెడ్డిపేట మండలం బంజార తండాకు చెందిన మూడు నెలల గర్భిణి మాలోత్‌ అశ్విని(19) ఆదివారం రాత్రి పాముకాటుకు గురై మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. అంకోల్‌ కొత్తబాది తండాకు చెందిన అశ్వినికి మూడు నెలల క్రితం బంజారా తండాకు చెందిన మాలోత్‌ సురేష్‌తో వివాహం జరిగినట్లు తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. తండాలో సోమవారం శుభాకార్యం ఉండడంతో ఆదివారం రాత్రి  అశ్విని ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులతో రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా నాగుపాము కాటువేయడంతో ఏదో పురుగు కరిచిందని అలాగే పడుకోగా రెండోసారి కాటు వేసింది. అశ్వినికి మెలకువ వచ్చి చూడగా పాము కన్పించింది.  కుటుంబసభ్యులు పామును చంపేసి అశ్వినిని నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మెదక్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని