logo

శత్రువులనుకున్నాం..సోదరులై ప్రేమను పంచారు

మల్కాన్‌గిరి జిల్లాలో పోడియా, కలిమెల దళాల్లో పని చేసిన నంగి కవాసి, రాధా మడ్కామి అనే ఇద్దరు మహిళా మావోయిస్టులు మూడేళ్ల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యవసాయం చేసుకుంటున్న

Published : 13 Aug 2022 02:30 IST

ఎస్పీకి రాఖీ కట్టిన లొగిపోయిన మహిళా మావోయిస్టులు

ఎస్పీకి రాఖీ కడుతున్న రాధా మడ్కామి

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి జిల్లాలో పోడియా, కలిమెల దళాల్లో పని చేసిన నంగి కవాసి, రాధా మడ్కామి అనే ఇద్దరు మహిళా మావోయిస్టులు మూడేళ్ల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యవసాయం చేసుకుంటున్న వీరు శుక్రవారం ఎస్పీ నితీశ్‌ వాద్వానీకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుతూ.. పోలీసులంటే పడేది కాదని, ఎన్నో సార్లు వారిపై దాడి చేసి హతమార్చామన్నారు. తాము శత్రువులుగా చూసిన వారే ఈ రోజు అన్నలుగా ప్రేమను పంచుతున్నారన్నారు. ‘అడవుల్లో ఉన్న అక్కల్లారా, చెల్లెల్లారా హింసను వీడండి. జన జీవన స్రవంతిలో కలవండి’ అని మహిళా మావోయిస్టులకు పిలుపునిచ్చారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని