ముక్తా పథకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు
రాష్ట్రంలో పట్టణ పేదలు, వలస కార్మికులకు కొవిడ్ పరిస్థితుల్లో జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య మంత్రి కర్మ తాత్పర అభియాన(ముక్తా) పథకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.
పథకం కింద ఇంకుడు గుంత, కాలువ నిర్మాణ పనుల్లో మహిళలు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో పట్టణ పేదలు, వలస కార్మికులకు కొవిడ్ పరిస్థితుల్లో జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య మంత్రి కర్మ తాత్పర అభియాన(ముక్తా) పథకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ వనరుల సంస్థ(డబ్ల్యూఆర్ఐ) రాస్ సెంటర్ ఫర్ సిటీస్ 2021-22 అవార్డుకు ముక్తా ఎంపికైంది. న్యూయార్క్లోని ఫోర్డ్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ జి.మధివధనన్ ఈ అవార్డును స్వీకరించారు. దీనిపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ శాఖపై ప్రశంసల జల్లు కురిపించారు. కొవిడ్ పరిస్థితుల్లో పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ముక్తా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా పనిచేసిన అధికారులను అభినందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
65 దేశాల నుంచి దరఖాస్తులు: ఈ అవార్డు కోసం 65 దేశాలకు చెందిన 155 నగరాల నుంచి 260 దరఖాస్తులు చేరగా, వాటిలో రాష్ట్రానికి చెందిన ముక్తా పథకం ఎంపికైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కింద ఇంతవరకు రాష్ట్రంలో 114 నగరాలు, పట్టణాల నుంచి 7 లక్షల మంది పేదలు, వలస కార్మికులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వ దస్త్రాలు పేర్కొంటున్నాయి. 22,500 సామాజిక స్థాయి అభివృద్ధి పనులు (రూ.208 కోట్లు) కోసం వీరంతా వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరితో పాటు 5,368 మిషన్ శక్తి బృందాలు, 438 బస్తీ వాసుల సంఘాలు ఇందులో భాగస్వాములైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పథకం కింద కాలువలు, సామాజిక కేంద్రాలు, వాననీటి సంరక్షణ కట్టడాలు, తదితర నిర్మాణాలతో పాటు మొక్కలు నాటడం, నీటి వనరుల పునరుద్ధరణ వంటి పనులకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవార్డు స్వీకరణ కార్యక్రమంలో మధివధనన్తో పాటు పట్టణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి శారదాప్రసాద్ పండా పాల్గొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అవార్డు స్వీకరిస్తున్న మధివధనన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
[ 26-04-2024]
గజపతి జిల్లాలో కాల వైశాఖి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. -
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!