జగన్నాథుని ‘ఖొసాపొడ’ గోప్యసేవలు
పూరీ శ్రీక్షేత్రంలో సోమవారం జగన్నాథునికి ‘ఖొసాపొడ’ గోప్యసేవలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు గర్భగుడి తలుపులు మూసేసి ఈ గోప్యసేవ చేశారు.
పురుషోత్తముని దివ్యమంగళ రూపం
గోపాల్పూర్, న్యూస్టుడే: పూరీ శ్రీక్షేత్రంలో సోమవారం జగన్నాథునికి ‘ఖొసాపొడ’ గోప్యసేవలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు గర్భగుడి తలుపులు మూసేసి ఈ గోప్యసేవ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న యంత్రాంగం ఉదయం నుంచే ఈ విషయాన్ని మైకుల ద్వారా ప్రకటించి దర్శనాలు ఉండవని భక్తులకు తెలిపింది. పురుషోత్తమ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు కర్రతో చేసినవి కావడంతో సంరక్షణకు కొన్ని రకాల లేపనాలు పూస్తారు. ఈ కార్యక్రమం అరుదుగా జరుగుతుంది. దీన్ని ‘ఖొసాపొడ’ సేవగా పేర్కొంటారు.
బడ్జెట్ రూపకల్పన... శ్రీక్షేత్ర యంత్రాంగం 2023-24 సంవత్సరం బడ్జెట్ పద్దుల రూపకల్పన చేసింది. ఈ ఏడాదిలో రూ.300.79 కోట్ల ఆదాయం, రూ.262.49 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్విక్రం సింగ్ యాదవ్ దీనిపై విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో పాలకవర్గం సమావేశం జరగనుందని, బడ్జెట్ పద్దులపై కూలంకష చర్చ తర్వాత అధికారికంగా తెలియజేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!