మాకొద్దు సాగునీటి ప్రాజెక్టు
ప్రభుత్వం.. ఆ గ్రామంలో మరో 10 రోజుల్లో నీటిపారుదల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న తరుణంలో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
రైతులు, గ్రామస్థుల నిరసన
ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్న గ్రామస్థులు
నవరంగపూర్, న్యూస్టుడే: ప్రభుత్వం.. ఆ గ్రామంలో మరో 10 రోజుల్లో నీటిపారుదల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న తరుణంలో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతంలో గురువారం నినాదాలు చేశారు. ప్రాజెక్టు కోసం తమ భూములు ఇవ్వలేమన్నారు. నవరంగపూర్ జిల్లా జొరిగావ్ సమితి చచర పంచాయతీ గబాగూడ గ్రామంలో సతీ నది వద్ద సాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని స్థానికులు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుత బిజద నేత ప్రదీప్ మాఝి ఇరవై ఏళ్ల క్రితం దాదాపు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేయడంతోపాటు చాలాసార్లు రాస్తారోకో చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఇటీవల 5టీ కార్యదర్శి వీకే పాండ్యన్ ప్రాంతాన్ని సందర్శించి వెళ్లారు. ఇంకొన్ని రోజుల్లో అనుమతులు వస్తాయని హామీ కూడా ఇచ్చారు. కల నిజమైన రోజు సమీపిస్తోందని, ఆనంద పడేలోపు వ్యతిరేకత వ్యక్తమైంది. వీకే పాండ్యన్ వచ్చినప్పుడు 5 పంచాయతీలకు చెందిన వందలాది మంది గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. హఠాత్తుగా గురువారం ఉదయం తమ భూములు ఇచ్చేది లేదని పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్ మాఝి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం తాను చాలా కృషి చేశానని, పలుమార్లు అధికారులతో చర్చించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. రెండు రోజుల క్రితం అక్కడి గ్రామాల్లో పర్యటిస్తే అంతా సంతోషం వెలిబుచ్చారని, ఇంతలోనే నిరసన చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇది విపక్ష పార్టీల కుట్ర అని ఆరోపించారు. గ్రామస్థులకు నచ్చజెపుతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
[ 26-04-2024]
గజపతి జిల్లాలో కాల వైశాఖి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. -
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత