logo

బస్సు బోల్తా: ఒకరి మృతి, 20 మందికి గాయాలు

కొరాపుట్‌ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్‌ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి.

Published : 28 Mar 2024 04:29 IST

బోల్తా పడిన బస్సు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్‌ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మలాË్కన్‌గిరి నుంచి బ్రహ్మపూరకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు పొడఘడ్‌ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలో జయపురం ఆటో చోదకుల సంఘం కార్యదర్శి నారాయణ రథ్‌ (42) అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి గాయపడిన వారిని బయిటకు తీసి, కొరాపుట్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వైద్య కళాశాలకు తరలించారు. ప్రమాదం విషయం తెలిసి బిజద జిల్లా అధ్యక్షుడు జీను హిక్కాకా, మాజీ ఎమ్మెల్యే కైలాష్‌ చంద్ర సంఘటన స్థలానికి, ఆరోగ్య కేంద్రానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. సబ్‌ కలెక్టర్‌ వేణుధర్‌ సబర బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూశారు. ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. 

లక్ష్మణ్‌ నాయక్‌ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని