logo

పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత

పాము కాటుతో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. గజపతి జిల్లా మోహన సమితి అడవా ఠాణా పరిధిలోని జిలికి  గ్రామంలో  శంకర్ ప్రధాన్ (30) శుక్రవారం రాత్రి మలవిసర్జనకు బయటికి వెళ్లాడు.

Published : 27 Apr 2024 10:07 IST

పర్లాఖెముండి: పాము కాటుతో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. గజపతి జిల్లా మోహన సమితి అడవా ఠాణా పరిధిలోని జిలికి  గ్రామంలో  శంకర్ ప్రధాన్ (30) శుక్రవారం రాత్రి మలవిసర్జనకు బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో  పాము కాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు  శంకర్‌ప్రధాన్‌ను అడవా వైద్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.  శనివారం ఉదయం  మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించగా..  వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యుడు అనుపమ్ పాడి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని