దాహం కేకలు
రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు.
గుక్కెడు నీటి కోసం ప్రజలు కటకట
పైపుల ద్వారా నీటిని సేకరిస్తున్న మహిళలు
గుణుపురం, న్యూస్టుడే: రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పద్మపురం సమితి పరిమా గ్రామంలో 70 నుంచి 75 కుటుంబాలు, 350 మంది జనాభా ఉంటున్నారు. తాగునీరు దొరక్క వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు గొట్టపు బావులున్నా, అవి దీర్ఘకాలంగా పని చేయడం లేదు. మరమ్మతులు చేయాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే రఘునాథ్ గమాంగ్, జిల్లా బిజద అధ్యక్షుడు సుధీర్ దాస్ గ్రామంలో జరిగిన సమావేశంలో పాల్గొని నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న దిగుడు బావి వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అందులోనూ నీరు తగ్గుముఖం పడుతోంది. దీంతో గతేడాది గ్రామస్థులంతా సమావేశమై ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముండిగట గ్రామం కొండ పైనుంచి ప్రవహిస్తున్న వాగు వద్ద అడ్డుగా మట్టి వేసి నీటిని నిల్వ చేశారు. చందాలు వేసుకుని పైపులు అమర్చుకుని గ్రామానికి నీటి సరఫరా చేసుకున్నారు.
కొండలపై పైపులు బిగిస్తున్న యువకులు
నీటి సమస్య పరిష్కరించాలి: కొండపైకి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం కష్టమవుతోంది. పైపుల ద్వారా తక్కువ నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలి. దీర్ఘ కాలంగా నీటి కోసం నానా అవస్థలు పడుతున్నాము. ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప సమస్య పరిష్కారం కావడంలేదు.
జమునా మాఝి, గ్రామస్థురాలు.
రోగాల బారిన పడుతున్నాం: కొండలపై నీరు కలుషితంగా ఉంది. వేడి చేసి తాగుతున్నా రోగాల బారిన పడుతున్నాము. గొట్టపు బావులు పనిచేయడం లేదు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
జంభూ మాఝి, గ్రామస్థురాలు.
పరిమా గ్రామం నీటి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ, సమితి సమావేశాల్లో ప్రస్తావించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరు అజయ్కుమార్ మాఝితో మాట్లాడగా పరిమా గ్రామంలో నీటి సరఫరా కోసం ప్రాజక్టు ప్రతిపాదనలో ఉందన్నారు. వసుధ యోజనలో భాగంగా ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి కుళాయిల ద్వారా నీటిసరఫరా చేస్తాం.
మమతా మాఝి, నువాగడ సర్పంచి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
[ 26-04-2024]
గజపతి జిల్లాలో కాల వైశాఖి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. -
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత