మహిళా ఓటర్లే అత్యధికం
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు.
నాలుగు లోక్సభ స్థానాల్లో 7,289 బూత్ల ఏర్పాటు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. రాజధానిలో గురువారం అఖిల పక్ష నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొరాపుట్, కలహండి, బ్రహ్మపుర, నవరంగపూర్ లోక్సభ స్థానాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారన్నారు. ఈ నాలుగు స్థానాల్లో 7,289 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు మరో 14 సహాయక పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ధొళో వెల్లడించారు. ఈ నాలుగు లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 62,84,649 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 31,87,771 మంది మహిళలు, 30,96,243 పురుషులు, 635 మంది హిజ్రాలు ఉన్నట్లు సీఈవో స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనల కింద 3,873 ఫిర్యాదులు అందాయని పేర్కొన్న నికుంజ బిహారీ, వీటిలో 3,854 పరిష్కరించామన్నారు.
రూ.118.65 కోట్ల విలువ సామగ్రి సీజ్
ఎన్నికల ముందు రాష్ట్రంలో రూ.118.65 కోట్ల విలువ చేసే మద్యం, మత్తు పదార్థాలు, నగదు తదితరాలను సీజ్ చేసినట్లు సీఈవో వెల్లడించారు. మార్చి 1 నుంచి ఇంతవరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్న ధొళో, వీటిలో పోలీసు యంత్రాంగం రూ.61.6 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలు, మద్యం, నగదు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అబ్కారీ శాఖ పరిధిలో రూ.30 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలు స్వాధీనం కాగా, రాష్ట్ర జీఎస్టీ శాఖ రూ.17 కోట్లు, ఆదాయం, ఇంటిలిజెన్స్ విభాగాల పరిధిలో రూ.6.4 కోట్లు, రవాణాశాఖ రూ.1.19, ఆదాయపన్ను శాఖ రూ.73 లక్షల విలువ చేసే పలు సామగ్రి, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. వీటితో పాటు అటవీ శాఖ పరిధిలో రూ.95 లక్షలు స్వాధీనం చేసినట్లు నికుంజ బిహారీ ధొళో గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడిచ్చారు... ఇప్పుడు అడుగుతున్నారు
[ 03-05-2024]
’హలో... ప్రకాష్ బాగున్నావా... నీ చదువుకు ఇబ్బందులేమీ లేవుగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇచ్చిన రూ.10 వేల ఉపకార వేతనం నీ చదువుకు కలిసొచ్చాయి కదా... -
వేసవి తుపానులు పొంచి ఉన్నాయ్
[ 03-05-2024]
ఇదివరకు రాష్ట్రానికి అక్టోబరు తుపానుల కాలంగా చెప్పుకునేవారు. కాల ప్రవాహంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో -
కంటాబంజిలో నవీన్ నామినేషన్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి నవీన ఈసారి రెండుచోట్ల పోటీకి దిగారు. మంగళవారం గంజాం జిల్లా హింజిలి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆయన గురువారం బొలంగీర్ జిల్లా కంటాబంజి -
భాజపాకు అవకాశమిచ్చి చూడండి: కేంద్రమంత్రి యాదవ్
[ 03-05-2024]
ప్రకృతి ప్రసాదించిన వనరులు, ఖనిజ సంపదకు నిలయమైన రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి చేయాలన్న ధ్యేయం గల భాజపాకు ఈసారి అవకాశమిచ్చి చూడండని కేంద్ర అటవీ -
బిజదకు ఓటేస్తే.. పాండ్యన్ పాలిస్తారు: భట్టి
[ 03-05-2024]
రాష్ట్రంలో పాలన దారి తప్పిందని, బిజద పార్టీకి ఓటు వేస్తే పాండ్యన్ పాలిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
కొండబాబు.. ఆంతర్యం ఏమిటో?
[ 03-05-2024]
ఆయన బిజద పార్టీలో సభ్యుడు కాడు. ఏ పదవికీ పోటీ చేయడం లేదు. పార్టీ నుంచి బహిష్కృతుడైనా పట్టువదలని విక్రమార్కుడిలా బిజద అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
పాల ప్యాకెట్లపై ఓటరు చైతన్యం
[ 03-05-2024]
ఎన్నికల యంత్రాంగం ఓటింగ్ శాతం పెంచడానికి తరచూ జన చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. -
అపరాజిత, మన్మథ్ల నామినేషన్ దాఖలు సమయంలో ఖుర్దా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
[ 03-05-2024]
ఖుర్దా కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా, బిజద కార్యకర్తలు జైశ్రీరాం, జైజై మోదీ, జైజగన్నాథ్, నవీన్ జిందాబాద్ నిదాదాలతో పార్టీ పతాకాలతో ప్రధాన