సనాతన్ మహాకుడోకు పిలిచి టికెట్ ఇచ్చిన సీఎం
గనులకు నిలయమైన కేంఝర్ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు.
నవీన్తో సనాతన్ మహాకుడో
భువనేశ్వర్, న్యూస్టుడే: గనులకు నిలయమైన కేంఝర్ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. సనాతన్కు ఇంతవరకు బిజదలో సభ్యత్వం లేదు. ‘మైనింగ్ కింగ్’గా గుర్తింపు పొందిన ఆయన 2014లో చంపువా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. బిజద ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. 2019లో పోటీ చేయని ఆయన కేంఝర్ లోక్సభ స్థానానికి బిజద తరఫున పోటీ చేసిన చంద్రాణి ముర్ముకు మద్దతుగా ప్రచారం చేశారు. సనాతన్ బిజదలో లేకపోయినా ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు. ఈసారి చంపువా స్థానంపై బిజద నుంచి ముగ్గురు నేతలు ఆశలు పెంచుకున్నారు. నవీన్ నివాస్ వద్ద తమ మద్దతుదారులతో బలప్రదర్శన చేశారు. వారిని పక్కన పెట్టేసిన నవీన సనాతన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం నివాసానికి వచ్చి కృతజ్ఞతలు తెలిపిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నవీన్ తనకు ఊహించని బహుమతి ఇచ్చారని చెప్పుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడిచ్చారు... ఇప్పుడు అడుగుతున్నారు
[ 03-05-2024]
’హలో... ప్రకాష్ బాగున్నావా... నీ చదువుకు ఇబ్బందులేమీ లేవుగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇచ్చిన రూ.10 వేల ఉపకార వేతనం నీ చదువుకు కలిసొచ్చాయి కదా... -
వేసవి తుపానులు పొంచి ఉన్నాయ్
[ 03-05-2024]
ఇదివరకు రాష్ట్రానికి అక్టోబరు తుపానుల కాలంగా చెప్పుకునేవారు. కాల ప్రవాహంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో -
కంటాబంజిలో నవీన్ నామినేషన్
[ 03-05-2024]
ముఖ్యమంత్రి నవీన ఈసారి రెండుచోట్ల పోటీకి దిగారు. మంగళవారం గంజాం జిల్లా హింజిలి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆయన గురువారం బొలంగీర్ జిల్లా కంటాబంజి -
భాజపాకు అవకాశమిచ్చి చూడండి: కేంద్రమంత్రి యాదవ్
[ 03-05-2024]
ప్రకృతి ప్రసాదించిన వనరులు, ఖనిజ సంపదకు నిలయమైన రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి చేయాలన్న ధ్యేయం గల భాజపాకు ఈసారి అవకాశమిచ్చి చూడండని కేంద్ర అటవీ -
బిజదకు ఓటేస్తే.. పాండ్యన్ పాలిస్తారు: భట్టి
[ 03-05-2024]
రాష్ట్రంలో పాలన దారి తప్పిందని, బిజద పార్టీకి ఓటు వేస్తే పాండ్యన్ పాలిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
కొండబాబు.. ఆంతర్యం ఏమిటో?
[ 03-05-2024]
ఆయన బిజద పార్టీలో సభ్యుడు కాడు. ఏ పదవికీ పోటీ చేయడం లేదు. పార్టీ నుంచి బహిష్కృతుడైనా పట్టువదలని విక్రమార్కుడిలా బిజద అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
పాల ప్యాకెట్లపై ఓటరు చైతన్యం
[ 03-05-2024]
ఎన్నికల యంత్రాంగం ఓటింగ్ శాతం పెంచడానికి తరచూ జన చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. -
అపరాజిత, మన్మథ్ల నామినేషన్ దాఖలు సమయంలో ఖుర్దా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
[ 03-05-2024]
ఖుర్దా కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా, బిజద కార్యకర్తలు జైశ్రీరాం, జైజై మోదీ, జైజగన్నాథ్, నవీన్ జిందాబాద్ నిదాదాలతో పార్టీ పతాకాలతో ప్రధాన