logo

సనాతన్‌ మహాకుడోకు పిలిచి టికెట్‌ ఇచ్చిన సీఎం

గనులకు నిలయమైన కేంఝర్‌ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్‌ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు.

Published : 23 Apr 2024 02:49 IST

నవీన్‌తో సనాతన్‌ మహాకుడో

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: గనులకు నిలయమైన కేంఝర్‌ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్‌ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. సనాతన్‌కు ఇంతవరకు బిజదలో సభ్యత్వం లేదు. ‘మైనింగ్‌ కింగ్‌’గా గుర్తింపు పొందిన ఆయన 2014లో చంపువా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. బిజద ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. 2019లో పోటీ చేయని ఆయన కేంఝర్‌ లోక్‌సభ స్థానానికి బిజద తరఫున పోటీ చేసిన చంద్రాణి ముర్ముకు మద్దతుగా ప్రచారం చేశారు. సనాతన్‌ బిజదలో లేకపోయినా ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు. ఈసారి చంపువా స్థానంపై బిజద నుంచి ముగ్గురు నేతలు ఆశలు పెంచుకున్నారు. నవీన్‌ నివాస్‌ వద్ద తమ మద్దతుదారులతో బలప్రదర్శన చేశారు. వారిని పక్కన పెట్టేసిన నవీన సనాతన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం నివాసానికి వచ్చి కృతజ్ఞతలు తెలిపిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నవీన్‌ తనకు ఊహించని బహుమతి ఇచ్చారని చెప్పుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని