logo

రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడిన వేళ...

బ్రహ్మపురలోని గంజాం న్యాయవాదుల సంఘం (జీబీఏ) సమావేశ మందిరం ఆవరణలో సోమవారం రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడ్డారు.

Published : 23 Apr 2024 02:54 IST

 మాట్లాడుకుంటున్న బ్రహ్మపుర లోక్‌సభ బిజద, కాంగ్రెస్‌ అభ్యర్థులు భృగు బక్షిపాత్ర్‌. రశ్మిరంజన్‌పట్నాయక్‌. చిత్రంలో బిక్రం పండా, దీపక్‌ పట్నాయక్‌

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని గంజాం న్యాయవాదుల సంఘం (జీబీఏ) సమావేశ మందిరం ఆవరణలో సోమవారం రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకోవడంతోపాటు ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మపుర లోక్‌సభ బిజద అభ్యర్థి భృగు బక్షిపాత్ర్‌ మధ్యాహ్నం జీబీఏ సమావేశ మందిరంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఆయనతోపాటు గోపాలపూర్‌ అసెంబ్లీ బిజద అభ్యర్థి బిక్రం కుమార్‌ పండా కూడా ఉన్నారు. వారు సమావేశం ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో బ్రహ్మపుర లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రశ్మిరంజన్‌ పట్నాయక్‌, బ్రహ్మపుర అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి దీపక పట్నాయక్‌ ప్రచారానికి అక్కడికి వచ్చారు. వారంతా ఒకరికొకరు పరామర్శించుకోవడం చూపురుల్ని ఆకర్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని