నేడు ప్రధాని మోదీ భువనేశ్వర్ రాక
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
రేపు బ్రహ్మపుర, నవరంగపూర్లలో బహిరంగ సభలు
భువనేశ్వర్, న్యూస్టుడే: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఆదివారం ఉదయం బ్రహ్మపుర చేరువలోని గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొణిసి వద్ద ఏర్పాటయ్యే భాజపా విజయ సంకల్ప ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు నవరంగపూర్ చేరుకుని మరో బహిరంగ సభలో పాల్గొంటారని భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ శనివారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు.
భాజపా శ్రేణుల్లో ఉత్సాహం
ఎన్నికల భేరీ మోగిన తర్వాత తొలిసారిగా మోదీ రాష్ట్రానికి వస్తున్నందున భాజపా శ్రేణుల్లో ఉత్సాహం కనిపిప్తోంది. ఆయన ఏం చెబుతారన్న దానిపై ప్రజల్లోనూ ఉత్కంఠ ఉంది. రాష్ట్రానికి ప్రధాని మోదీ చాలాసార్లు వచ్చారు. అలా వచ్చినపుడు ఆయన నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. గతసారి (2019) ఎన్నికల సమయంలోనూ ఆయన సంయమనం పాటించారు. ఈసారి ఈ పరిస్థితి ఉండకపోవచ్చునని, వైఫల్యాలు ఎండగట్టే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. ఇటీవల దిల్లీలో ఒక టీవీ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఒడిశా ప్రతిష్ఠ మసకబారిందని, ప్రగతి ఫలాలు ప్రజల ముంగిళ్లకు చేరడం లేదని ఆయన విమర్శించారు. పాలన మారాలని, పనులు చేసే ప్రభుత్వం అధికారంలోకి రావాలని అంతా కోరుతున్నారన్నారు. ఇది భాజపా వల్లే సాధ్యమన్న ఆశాభావం ఓటర్లలో ఉందని మోదీ చెప్పారు.
12 సభల్లో పాల్గొననున్న మోదీ
ఒడిశాలో నాలుగు విడతల పోలింగ్ (ఈ నెల 13, 20, 25, జూన్ 1న) నిర్వహించనుండగా ఈ నెల 30 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ప్రధాని మోదీ 12 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని, నెలాఖరు వరకు రాష్ట్రానికి తరచూ వస్తారని భాజపా అధికార వర్గాలు శనివారం తెలిపారు. ఈ నెల 10 సాయంత్రం భువనేశ్వర్కు రెండోసారి రానున్న ప్రధాని రాజధానిలో రోడ్షో నిర్వహిస్తారు. 12న భవనేశ్వర్, బొలంగీర్లలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మరోవైపు ఆదివారం రాత్రి తొలి పర్యటన ఖరారు కాగా, భువనేశ్వర్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రాజ్భవన్లో మోదీ రాత్రి విడిది చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోయల్, దిలీప్ల మధ్య హోరాహోరీ
[ 18-05-2024]
కేంద్రమాజీ మంత్రి, సుందర్గఢ్ సిటింగ్ ఎంపీ జోయల్ ఓరంకు ఈసారి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. -
రాష్ట్రంలో 15 ఎంపీ, 75 కు పైగా అసెంబ్లీ స్థానాలు మావే
[ 18-05-2024]
ఒడిశాలో ఈసారి 15 లోక్సభ, 75కుపైగా అసెంబ్లీ స్థానాల్లో భాజపా విజయం తథ్యమని, తమిళపాలనకిక తెరపడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు. -
రత్నభాండాగారం తాళం చెవి పాండ్యన్ వద్ద ఉంది
[ 18-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం (రేషన్) ఇస్తున్నారని, ఒడిశా సీఎం నవీన్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు వట్టి గోనె సంచులిచ్చారని, ఈ సంచులు తమిళనాడులో తయారైనవని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఎద్దేవా చేశారు. -
కుందిలిలో కృషి బజార్కు మోక్షమెప్పుడో
[ 18-05-2024]
కనీస సౌకర్యాల కరవు.. శిథిల భవనాలు, నిత్యం వెంటాడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు.. వినియోగానికి నోచుకోని బజార్.. ఇదీ కొరాపుట్ జిల్లాలోని కుందిలి వారపు సంతలో పంటలు విక్రయించేందుకు వచ్చిన అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. -
19న రాష్ట్రానికి మోదీ
[ 18-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం (19న) రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ రానున్నారు. -
గంజాం జిల్లాకు అదనపు కేంద్ర బలగాలు
[ 18-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. -
నాలుగున్నర కోట్ల ప్రజలు నా ఊపిరి: నవీన్
[ 18-05-2024]
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలు తన ఊపిరని, అందరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నానని, తన పాలనలో అన్ని వర్గాలవారికి న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
నవీన్జీ... మీకు 25 ఏళ్లు చాల్లేేదా?: ధర్మేంద్ర
[ 18-05-2024]
రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. -
రాష్ట్రంలో అన్నదాతలకు అన్యాయం: విష్ణుదేవ్
[ 18-05-2024]
నవీన్ పట్నాయక్ పాలనలో ఒడిశాలో అన్నదాతలకు అన్యాయం జరిగిందని, ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు (ఎంఎస్పీ) కల్పించడంలో విఫలమయ్యారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయె అన్నారు. -
ముగ్గురు భాజపా నేతలపై వేటు
[ 18-05-2024]
-
నిందితుడ్ని తప్పించే యత్నం పోలీసు స్టేషన్లోకి చొరబాటు
[ 18-05-2024]
గంజాం జిల్లాలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి