కనిపించే దేవుడు.. వైద్యుడు
వైద్యో నారాయణ హరి అంటారు.. మనిషికి జీవం పోసేది ఆ పరమాత్ముడు అయితే.. పునర్జన్మ పోసేది వైద్యుడే. ఆపదలో ఉన్న వారికి తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ఊపిరి పోస్తాడు. అందుకే దేవుడిలా పూజిస్తారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు వైద్య వృత్తికే అం
నేడు డాక్టర్స్ డే
రింగురోడ్డు, న్యూస్టుడే
వైద్యో నారాయణ హరి అంటారు.. మనిషికి జీవం పోసేది ఆ పరమాత్ముడు అయితే.. పునర్జన్మ పోసేది వైద్యుడే. ఆపదలో ఉన్న వారికి తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ఊపిరి పోస్తాడు. అందుకే దేవుడిలా పూజిస్తారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు వైద్య వృత్తికే అంకితం అయ్యాయి. ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారిపై కథనం.
ఆ ముగ్గురే స్ఫూర్తి
కేంద్రాసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి కేవీ మురళీమోహన్, భార్య అరుణ లండన్లో గైనకాలజిస్టుగా, కుమారుడు సిదార్థ ఈఎన్టీ నిపుణులుగా అమెరికాలో ఉన్నారు. కుమార్తె మేఘన ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తన మేనత్తలు సావిత్రి, నళిని, చిన్నాన్న దుర్గాదాస్ వైద్య వృత్తిని ప్రజా సేవగా భావించే వారని, వారిని చూసి 50 కుటుంబాల్లో 30 మంది వైద్యులు అయ్యారని మురళీమోహన్ పేర్కొన్నారు.
చల్లని చూపు..
ఉత్తరాంధ్రలో కంటి వైద్య నిపుణుల్లో ఒకరు మంచు కుమార్ స్వామి. 35 ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. 22 ఏళ్లపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశారు. సొంత జిల్లా శ్రీకాకుళంలోని గుత్తావళి, పురుషోత్తపురం, కొరసవాడ గ్రామాలను దత్తత తీసుకొని ఉచితంగా శస్త్రచికిత్సలు, ఉచిత వైద్య పరీక్షలు చేస్తూ మందులు అందిస్తున్నారు. విజయనగరం జిల్లాలోనూ విశేష సేవలందిస్తున్నారు. వందలాది వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి కంటిచూపు కోల్పోయిన వారికి శస్త్రచికిత్సలు చేసి చూపును ప్రసాదించారు. 2007లో ఉత్తమ కంటి వైద్య నిపుణులుగా అప్పటి ప్రభుత్వం సత్కరించింది. ఈయన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు వైద్యులే.
ఐదు కుటుంబాల నుంచి..
తన ఇంట్లో వైద్యులు ఉంటే పది మందికి సేవ చేయడానికి అవకాశం ఉంటుందని బొండపల్లి మండలం నెలివాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అప్పలకొండ, ఎస్బీ.నాయుడు ముగ్గురు పిల్లలను వైద్యులు చేశారు. ఇందులో ఎస్ఎస్ రవీంద్రబాబు శ్రీకాకుళం వైద్య కళాశాలలో జనరల్ సర్జన్, అసిస్టెంటు ప్రొఫెసర్గా, ఎస్ఎస్ఆర్.నాగేంద్రబాబు కేజీహెచ్లో అసిస్టెంటు ప్రొఫెసర్గా, అమరేంద్రబాబు విశాఖలో రక్తనాళాల నిపుణులుగా సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో రక్తనాళాల నిపుణుల్లో ఈయన ఒకరు. నాగేంద్రబాబు, అమరేంద్రబాబు భార్యలు కూడా వైద్యులే. వీరే స్ఫూర్తిగా నెలివాడలో మరో అయిదు కుటుంబాల నుంచి వైద్యులు తయారయ్యారు.
అమ్మ కోరిక మేరకు..
తల్లి కోరిక మేరకు వైద్యురాలయ్యారు విజయనగరం డీఎంహెచ్వో రమణకుమారి. ఆమె సొంతూరు కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఉయ్యూరు. ‘అమ్మ నాగేశ్వరి గృహిణి, బీఏ చదివారు. నాన్న ఎస్.గంగయ్య రైల్వే అధికారి. చెల్లి సుగుణ. తండ్రి రైల్వే ఉద్యోగి కాబట్టి, ఎప్పుడూ బదిలీల మీదే చదువు కొనసాగేది. రాత్రి పూట నన్ను, చెల్లిని నిద్ర పుచ్చుతూ అందరికీ వైద్యం అందుబాటులోకి వస్తే.. మాతృమూర్తి గర్భశోకం తప్పుతుందని చెప్పేవారు. దీంతో ఇద్దరం మెడిసిన్లో చేరాం. అప్పటి వరకు అమ్మమ్మ, నాన్నమ్మ కుటుంబాల్లో ఎవరూ వైద్యులు లేరు. ఆ తర్వాత మా పాప, మా చెల్లి, మేనకోడలు, మరికొందరు అలా మొత్తం 15 మంది వరకూ వైద్యులమయ్యాం’ అని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్