రూ.వెయ్యితో సరిపెట్టేశారు..!
కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసినా నిధుల కేటాయింపుపై అధికారుల్లో స్పష్టత లోపించింది. ఏ ప్రాతిపదికన నిధులివ్వాలో తెలియక వారు సతమతం అవుతున్నారు.
పాత జిల్లాల నుంచి రాని మూలధనం
కార్యకలాపాల నిర్వహణకు మహిళా సమాఖ్యలకు అవస్థలు
పార్వతీపురం, న్యూస్టుడే
కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసినా నిధుల కేటాయింపుపై అధికారుల్లో స్పష్టత లోపించింది. ఏ ప్రాతిపదికన నిధులివ్వాలో తెలియక వారు సతమతం అవుతున్నారు. ఆర్థిక పరమైన అధికారాలు లేకపోవడంతో జిల్లా సమాఖ్యకు అధ్యక్ష, కార్యదర్శులుగా నియమితులైన వారు ఎలాంటి పనులు చేసేందుకు వీలు లేకుండా పోతోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 15 మండలాలున్నాయి. వీటిలో నాలుగు శ్రీకాకుళం, 11 విజయనగరం నుంచి విడిపోయాయి. దీంతో పార్వతీపురం మన్యంలో 566 గ్రామైక్య సంఘాలు, 19,501 స్వయం సహాయక సంఘాల్లో 2,25,667 మంది సభ్యులుగా మిగిలారు. వీరందరినీ కలిపి జిల్లా సమాఖ్యను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం వీటికి ఆర్థిక బలం లేకుండా పోయింది. పాత జిల్లాల నుంచి ఆయా మండలాలకు సంబంధించిన వాటాధనం విడుదల చేసి నిధులు ఇవ్వాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమాఖ్యల్లో ఒక్కో దానిలో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఉంటాయని, ఈ లెక్కన పార్వతీపురం మన్యంకు సుమారు రూ.2 కోట్లయినా వాటా ధనం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటికోసం డీఆర్డీఏ నుంచి పాత జిల్లాలకు లేఖలు రాసినా స్పందన రాలేదు.
ఉందన్న మాటే కానీ..
జిల్లాలో సమాఖ్య ఏర్పాటు తర్వాత నాలుగు నెలల క్రితం కురుపాం మండలం లేవిడి, వీరఘట్టం, బలిజిపేట మండలాల నుంచి అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకున్నారు. వీరి పేరుతో ప్రారంభంలో రూ.1000తో బ్యాంకు ఖాతా ప్రారంభించారు. అంతకు మించి ఖాతాలో ఇప్పటి వరకు నిధులేవీ జమకాలేదు. దీంతో మండల సమాఖ్యలకు రుణాలు ఇచ్చేందుకు వీరి వద్ద ఎలాంటి సొమ్ములు లేకుండా పోయాయి. అవసరానికి కింది స్థాయి సమాఖ్యల నుంచే నగదు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
నాలుగు నెలలైనా..
- సుజాత, మేరీ, కార్యదర్శి, కోశాధికారి, జిల్లా మహిళా సమాఖ్య
జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని నాలుగు నెలలైంది. ఏ కార్యక్రమైనా మా ఆధ్వర్యంలోనే జరగాలి. కానీ ఖాతాలో నిధులు లేకపోవడంతో ప్రయాణ భత్యాలను మండల సమాఖ్యల నుంచి తీసుకుంటున్నాం. పాత జిల్లాల నుంచి మండలాల వాటా ధనం ఇంకా రాలేదు. గిరిజన మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులు మాత్రమే చెక్పవర్ వినియోగిస్తున్నారు. జెడ్ఎంఎస్ అంతంతమాత్రంగానే ఉంది.
సెర్ప్ ఆదేశాలకు ఎదురుచూపు
- వై.సత్యంనాయుడు, ఏపీడీ, టీపీఎంయూ, పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా సమాఖ్యకు నిధులు కేటాయించాలని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సమాఖ్యలకు లేఖలు రాశాం. విజయనగరం డీఆర్డీఏలో దీనిపై చర్చించినట్లు సమాచారం ఉంది. మా లేఖను ప్రస్తావిస్తూ సెర్ప్కు లేఖ కూడా రాసినట్లు తెలిసింది. అక్కడ నుంచి అనుమతులు వస్తే జిల్లాకు నిధులు అందుతాయి. యథాతథంగా కార్యకలాపాలు జరిగే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్