సచివాలయం ఉద్యోగులు అందుబాటులో ఉండాలి
బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రామప్రజలు అధికారులను అభ్యర్థించారు.
బలిజిపేట: బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రామప్రజలు అధికారులను అభ్యర్థించారు. గడిచిన కొద్ది రోజులుగా ఈ సచివాలయంలో పనిచేస్తున్న ప్రధానశాఖల ఉద్యోగులెవ్వరూ ఇక్కడకు సక్రమంగా హాజరుకాకుండా విధులకు గైర్హాజరవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం ఇక్కడ పనిచేసిన ఉద్యోగుల్లో ఇద్దరు బలిజిపేట తహసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సమావేశానికి వెళ్లగా, మిగతా సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో ఈ సచివాలయం కుర్చీలన్నీ ఖాళీగానే కన్పిస్తున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కూడా ప్రజలు వాట్సాప్ ద్వారా మీడియాకు గురువారం పంపించారు. గ్రామంలోని ప్రజలకు పంచాయతీ కార్యదర్శి ఎవరో తెలియదన్నారు. ఈ అంశంపై ఎంపీడీవో రమేష్నాయుడును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా, వారానికొకరోజు సచివాలయాల సందర్శన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, గతవారం వంతరాం సచివాలయానికి వెళ్లామని, కొంతమంది సిబ్బంది ఆలస్యంగాను, కొంతమంది గైర్హాజరవుతున్నట్టు తేలిందన్నారు. వీరిని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 27-04-2024]
ఇండియా కూటమి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన మోహనరావుకు, సీపీఎం పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా నాయకులు యమ్మల మన్మథరావు, గేదెల సత్యనారాయణ కోరారు. -
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..