ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు.
శస్త్రచికిత్స చేయలేదని రోగి సహాయకుల ఆందోళన
కారులో రోగి రామారావు
విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్టుటడే: శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. బొబ్బిలికి చెందిన టి.రామారావు ఇంట్లో జారిపడడంతో మక్క ఎముక విరిగింది. ఎనిమిది రోజుల కిందట సర్వజన ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. గురువారం శస్త్రచికిత్స చేస్తామని, ఆహారం తీసుకోవద్దని ఎముకల వైద్య నిపుణులు సూచించారు. ఆమేరకు అతనిని ఉదయాన్నే ఆపరేషన్ గదికి బంధువులు తీసుకొచ్చారు. మత్తు వైద్యులు వచ్చి చూసి వెళ్లాక సుమారు 4గంటల పాటు రోగి వద్దకు ఎవరూ రాలేదు. అడిగినా ఎవరూ సమాధానం చెప్పలేదు. చివరికి వైద్యుడు వచ్చి సోడియం స్థాయిలు తగ్గాయని, తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పి వెళ్లిపోయారు. గంటల తరబడి రోగిని ఆకలితో ఉంచడంతోనే సోడియం లెవల్స్ తగ్గాయని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ఆవరణలో కారులో రోగిని కూర్చొబెట్టి నిరసన తెలిపారు. పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి, ఇక్కడ వైద్య సేవలు ఎవరికీ అందడం లేదు.. ఉద్యోగులు ఎందుకు వస్తున్నారో..? ఏం చేస్తున్నారో? తెలియడం లేదని రోగి మేనల్లుడు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శేఖర్ ఆరోపించారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని రోగి సహాయకులకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. వైద్యులతో మాట్లాడి తిరిగి అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ‘మిత్ర’ ద్రోహం
[ 01-05-2024]
‘జగన్ మీ బిడ్డ.. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికలైన తర్వాత మరోలా.. ఉండేవాడు కాదు. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. -
నేనున్నానన్నావ్.. బొబ్బిలిని వదిలేశావ్
[ 01-05-2024]
అబద్ధపు హామీలు.. కపట ప్రేమ కురిపించి.. ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత నిజస్వరూపం బయటపెట్టారు. -
బొబ్బిలి ఉత్తర కోట వద్ద జగన్ సభ
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలిలో సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన బుధవారం ఖరారైంది. ముందుగా చంద్రబాబు ప్రజా సంకల్పయాత్ర జరిగిన చోట సభాస్థలం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. -
తొలిరోజు నుంచీ పోలీసుల హడావుడి
[ 01-05-2024]
సీఎం జగన్ సిద్ధం సభ బుధవారం ఉదయం 10 గంటలకు బొబ్బిలిలో జరగనుంది. -
అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
[ 01-05-2024]
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. -
అవ్వాతాతలతో.. సర్కార్ పింఛనాట!
[ 01-05-2024]
వృద్ధులతో వైకాపా సర్కార్ పింఛనాట ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందించే వెసులుబాటు ఉన్నా.. పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
ఓ వినాశకారి.. ఈ వారధులు చూడోసారి
[ 01-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనపడడం లేదు.. ఇన్నిరోజులూ మాటలతోనే బతికేసిందీ ప్రభుత్వం.. హామీల నీటిమూటలతో ప్రజలను ముంచేసింది.. -
ప్రతిపక్షాలపై కక్ష.. పండుటాకులకు శిక్ష
[ 01-05-2024]
పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పండుటాకులతో ఆటలాడుకుంటోంది. నెలకో మాట చెప్పి.. వారిని అష్టకష్టాలు పెడుతోంది.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. -
సంక్షేమ పథకాల పేరుతో జగన్ మభ్యపెట్టారు
[ 01-05-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి వారి చేతికి చిప్ప ఇస్తున్నారంటూ తెలగ, బలిజ, కాపు దక్షిణ భారత కన్వీనర్ దాసరి రాము ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే స్వగ్రామంలో జయకృష్ణకు బ్రహ్మరథం
[ 01-05-2024]
పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి(వైకాపా) స్వగ్రామం వండువలో కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
సొమ్మసిల్లిన సంధ్యారాణి
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి ఎండ వేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. మంగళవారం ఆమె మక్కువ మండలంలోని పెద ఊటగెడ్డ గ్రామంలో ప్రచారం చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్