అవ్వాతాతలతో సర్కారు చెలగాటం
సామాజిక పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్లను జమ చేసి వైకాపా ప్రభుత్వం అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
ఎండకు అల్లాడిన పింఛన్ దారులు
గజపతినగరం బ్యాంకు వద్ద వృద్ధుల పడిగాపులు
సామాజిక పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్లను జమ చేసి వైకాపా ప్రభుత్వం అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మూడో రోజు సైతం బ్యాంకు శాఖలు కిటకిటలాడాయి. సచివాలయ ఉద్యోగులతో లబ్ధిదారులు అందరికీ ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసే అవకాశమున్నా.. బ్యాంకు ఖాతాల్లో జమచేసి.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేందుకు అధికార పక్షం చేసిన కుట్ర ఇది అని అవ్వాతాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు ఎండ తీవ్రత తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ ఎదురుచూసి ఉసూరుమంటూ వెనుదిరిగారు.
- న్యూస్టుడే, సాలూరు గ్రామీణం, సీతంపేట, పాలకొండ, సీతానగరం, పార్వతీపురం పురపాలక, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, గజపతినగరం
పార్వతీపురం పట్టణంలోని బందంవారి వీధి ఎస్బీఐ బ్రాంచికి పింఛను కోసం తూర్పువీధికి చెందిన వృద్ధుడు పి.శంకరరావు వచ్చారు. ఎండధాటికి విలవిల్లాడాడు. దీంతో స్థానికులు నీరు తాగించి ఇంటికి పంపించారు.
పునరుద్ధరణ..
మండలంలోని కొఠియా గ్రామాలతో పాటు ఇతర గిరిజన ప్రాంతాల నుంచి గిరిజనులు సాలూరులోని బ్యాంకులకు శనివారం ఉదయం ఎనిమిది గంటలకే వచ్చారు. తెరిచిన తర్వాత కొందరి ఖాతాలు చెల్లుబాటులో లేవని తెలుసుకొని పునఃప్రారంభించారు. వారి నుంచి ఈకేవైసీ సేకరించి కొత్తగా ఫొటోలు, సంతకాలు తీసుకుని ఖాతాలను వినియోగంలోకి తీసుకువచ్చారు. మామిడిపల్లి ఏపీజీవీబీలో 20 మంది ఈ సేవలు అందుకున్నారు.
ఐదు కి.మీ వచ్చాం
వీరిది గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల కొండపైనున్న కప్పకల్లు గ్రామం. శనివారం సుమారు 5 కిలోమీటర్లు కాలినడకన తాడికొండ చేరుకుని, ఆటోలో ఎల్విన్పేట బ్యాంకుకు వచ్చారు. మధ్యాహ్నం మండుటెండలో ఇలా గ్రామానికి పయనమయ్యారు.
గంటల కొద్దీ నిరీక్షణ..
సీతంపేటలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఏపీజీవీబీ, ఖాతాదారుల సేవా కేంద్రాలకు దూర ప్రాంతాల నుంచి పింఛనుదారులు చేరుకున్నారు. ఆటోలు, బస్సుల్లో వచ్చి గంటల కొద్దీ నిరీక్షించి మండుటెండలో తిరుగుముఖం పట్టారు. ఆదివారం సెలవు కావడంతో ఎక్కువ మంది వచ్చారు. దీంతో సీతంపేట యూనియన్ బ్యాంకు ముందు గంటల కొద్దీ వృద్ధులు నిరీక్షించారు.
ఖాతా లేకుండా డబ్బులెలా వేశారు..
పింఛను కోసం స్టేట్ బ్యాంకు చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్నా. సచివాలయానికి వెళ్తే స్టేట్ బ్యాంకు అకౌంటుకు డబ్బులు పడ్డాయన్నారు. అక్కడి వెళ్తే ఖాతా పుస్తకం తెమ్మన్నారు. అకౌంటు లేకుండా ఎక్కడ నుంచి తీసుకురాను. మూడు రోజులుగా తిరగలేక పోతున్నా.
- ముత్యాల సావిత్రి, సీతానగరం
పండుటాకులకు తప్పని పాట్లు
నాకు పూర్తిగా చదువులేదు. బ్యాంకు పుస్తకానికి ఆధార్ అనుసంధానం కాలేదంటున్నారు. అది ఎలా అవుతుందో నాకు తెలియదు. అధికారులను అడిగితే ఏవేవో చెబుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇలా మమ్మల్ని ఎందుకు అవస్థలు పెడుతున్నారు.
- గురాన స్వాములమ్మ, సీతారాంపురం, గజపతినగరం
రెండ్రోజులుగా తిరుగుతున్నా
గత రెండు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. ముందు వెంకటాపురం ఎస్బీఐ ఖాతాలో పడ్డాయన్నారు. శుక్రవారం అక్కడ కేంద్రం వద్దకు వెళితే పుస్తకం చూసి, పడలేదని, ఆన్లైన్ చేయాలన్నారు. తిరిగి శనివారం వచ్చాను. ఇప్పుడు ఏం చెబుతారో అని బెంగగా ఉంది.
- అప్పన్న, సీతారాంపురం, గజపతినగరం
కాళ్లు అరిగేలా తిరుగుతున్నా..
పింఛను కోసం మూడు రోజులుగా సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా. బ్యాంకు ఖాతాలో నగదు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. సచివాలయానికి వచ్చి అడిగితే జమ అవుతుంది సోమవారం వరకు చూడమన్నారు. మూడు రోజులుగా కూలిపనికి వెళ్లకుండా తిరగడానికే సరిపోతుంది.
- గాజుల పార్వతి, పాచిపెంట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనలు తొక్కి‘పెట్టే’శారు
[ 18-05-2024]
విజయనగరం అర్బన్, గ్రామీణం: గురువారం మధ్యాహ్నం 3 గంటలు.. విజయనగరం తహసీల్దారు కార్యాలయం.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీసు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూమ్ ఉంది. -
ప్రజలకు అందుబాటులో ఉంటాం
[ 18-05-2024]
కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. -
19 నుంచి తోటపల్లిలో కల్యాణ వేడుకలు
[ 18-05-2024]
తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సీతారామస్వామి వార్షిక కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. -
ఏటా రూ.కోట్లు.. పనులకు తూట్లు
[ 18-05-2024]
సాలూరు పట్టణంలోని గాంధీనగర్ నుంచి కొంకివీధి, వేదసమాజం, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు ఉండే వన్వే దారి ఇది. అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. -
ఇదే.. సాలూరు స్మార్ట్ టౌన్షిప్
[ 18-05-2024]
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో మధ్య ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సాలూరులో పట్టణ జాతీయ రహదారి పక్కన కేటాయించింది -
ఆందోళనకు గురువులు సిద్ధం
[ 18-05-2024]
పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
రాష్ట్రంలో ఈవీఎంలకు భద్రత లేదు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యకాండను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు
[ 18-05-2024]
ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన సంఘటన శుక్రవారం గజపతినగరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది -
చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు
[ 18-05-2024]
సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. -
కన్నీటి సంద్రం
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం, జియ్యమ్మవలస, బొండపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. -
దిబ్బలపాలెంలో పులి సంచారం..?
[ 18-05-2024]
భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్చ్..ఇదేం నిర్వహణ?
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల్లో కాలువల తీరు ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు