జనం భూముల్లో జగన్ భూతం
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన ఈశ్వరరావుకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాస్బుక్, టైటిల్ పత్రాలు తన వద్దే ఉన్నాయి.
ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో కొత్త చిక్కులు
భూముల రీ సర్వే పేరిట ఇప్పటికే మాయ
ప్రభుత్వ నిర్వాకంతో ఆస్తులకు రక్షణ కరవు
భూమికి రైతుకు ఉన్న సంబంధం విడదీయరానిది. అన్నం పెట్టి, ఆకలి తీర్చే భూదేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరుగాడాలి. ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లే భావిస్తారు. రైతును ఉద్ధరించడంలో తానే గొప్పోడినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వారి భూములను నొక్కేసే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. అతని అడుగులకు మడుగులొత్తే కొందరు తొత్తుల్లాంటి అధికారులతో చాప కింద నీరులా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. వారు భూమికి హక్కుదారులుగా ఏ పేరు రికార్డుల్లో రాస్తే వారిదే వారికే చెందుతుంది. భూమి సమస్యలు తలెత్తితే సివిల్ కోర్టుల్లో సవాలు చేసి న్యాయం పొందే అవకాశం ఇప్పటి వరకు ఉంది. జగన్మోహన్రెడ్డి రూపొందించిన పిడుగులాంటి చట్టంతో సివిల్ కోర్టుల్లో ఈ భూ వివాదాలు పరిష్కరించుకునే వీల్లేదు.
కొత్తవలసలో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేసిన న్యాయవాదులు (పాత చిత్రం)
- విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన ఈశ్వరరావుకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాస్బుక్, టైటిల్ పత్రాలు తన వద్దే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం సమగ్ర భూ సర్వే పేరిట రీ సర్వే చేపట్టింది. విచిత్రం ఏమిటంటే.. ఈశ్వరరావు భూమి రెవెన్యూ రికార్డుల్లో అదే గ్రామానికి చెందిన రామారావు పేరిట నమోదైంది.
- కొత్తవలస మండలం దెందేరు, గులివిందాడలో కొందరు రైతులకు చెందిన భూములకు అధికార పార్టీ నాయకులు నకిలీ 1-బీ సృష్టించారు. ఆపై సర్వే నంబర్లు మార్పు, చేర్పులు చేసి ఇతరుల పేరుతో క్రయ ఒప్పందంతో కూడిన జీపీఏ చేయించుకుని కాజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2023 ఇటువంటి వాటికి హక్కులు కల్పించే అవకాశం ఉంది.
- పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన ఇద్దరు అన్నదమ్ములకు తండ్రి నుంచి ఏడెకరాల భూమి సంక్రమించింది. ఆస్తి పంపకాల్లో ఇద్దరికీ చెరో మూడున్నర ఎకరాలు దక్కింది. రికార్డుల్లో నమోదు చేశారు. ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే అనంతరం ఒకరి పేరిట నాలుగున్నర ఎకరాలు, మరొకరి పేరిట రెండున్నర ఎకరాలుగా నమోదైంది.
- కొత్తవలస మండలంలోని అర్ధానపాలెం రెవెన్యూలో ఆరు ఎకరాలకు పైగా భూమిని దస్త్రంలో ఉన్న చిన్న అవకాశాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ వారు తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించిన యజమానికి విషయం తెలిసి వెంటనే సివిల్ కోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇక మీదట సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ఫలితంగా ఈ భూమి అధికార పార్టీ నాయకుల పరం అవుతుంది.
నా భూమిని మార్చేశారు
నాకు అయిదె కరాలు ఉంది. ఇప్పుడు రికార్డుల్లో 1.47 ఎకరాలే కనిపిస్తోంది. మిగిలిన భూమి ఏ సర్వే, ఖాతా నంబర్లలో ఉందో తెలియదు. ఇందులో నా సంపాదనతో 1.43 ఎకరాలు కోనుగోలు చేశాను. దీంట్లో కేవలం 0.47 సెంట్లు రికార్డుల్లో చూపిస్తోంది.
- ఇజ్జురోతు బంగారునాయుడు, పీకే పాలవలస, చీపురుపల్లి మండలం
ఈనాడు - విజయనగరం, న్యూస్టుడే, కొత్తవలస, చీపురుపల్లి గ్రామీణ
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 1,950 గ్రామాల పరిధిలో సుమారు 20 లక్షల ఎకరాల భూములు (అన్ని రకాలు) ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న కమతాలే ఎక్కువ. పాత దస్త్రాల ఆధారంగా లావాదేవీలు, వారసత్వ పంపకాలు కొనసాగుతున్నాయి. భూ రికార్డుల విషయంలో సమగ్రత లేకపోవడం వల్ల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో తప్పుడు రికార్డులతో భూ రిజిస్ట్రేషన్లు జరగడం మరో సమస్యగా మారింది. వీటిపై న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. వీటి పరిష్కారానికే వందేళ్ల తర్వాత భూముల సర్వేకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వం చెబుతున్నా కొత్త వివాదాలకు కారణమవుతోంది.
హైకోర్టు వరకు బక్క రైతులు వెళ్లగలరా?
ఉమ్మడి జిల్లాలో అర ఎకరా, ఎకరా ఉన్న చిన్న రైతులే ఎక్కువ. వీరికి పంట చేతికి రావడమే గగనం. ఉన్నకాడికి తిని, బతుకులు ఈడుస్తున్న ఇలాంటి వారు తమ భూములను రక్షించుకునేందుకు హైకోర్టు వరకు వెళ్లే పరిస్థితి ఉందా.. పోరాడే జవసత్వాలు బక్క రైతులకు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. ఈ చట్టం అమలైతే సొంత భూమిని వదులుకొని కూలి బతుకులు బతకడానికి రైతన్నలు సిద్ధం కావాల్సిందే మరి.. కొత్త చట్టం అమలైతే అందరూ నష్టపోతారని, సొంత భూములను సైతం వదులుకోవాల్సిందేనని వ్యవసాయ రంగ నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొడవళ్లు విసిరే ఆ రోజు రానుందేమో..
1960 దశకంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో ‘భూమి కోసం భుక్తి కోసం’ గిరిజన రైతులు పోరాటం చేశారు. తమ భూమికి తామే పరాయివారీగా మారిపోయామని, భూమి తమదైనా, హక్కు తమకు లేకపోవడమేమిటని ప్రశ్నిస్తూ కొడవళ్లు విసిరేందుకు గిరిజన రైతులు సిద్ధమయ్యారు. జగన్మోహన్రెడ్డి రచించిన కొత్త భూ చట్టం అమలులోకి వస్తే.. అప్పట్లో చవిచూసిన చీకటి రోజులు గిరిజన రైతులకు మళ్లీ ఎదురొచ్చే ప్రమాదం లేకపోలేదు.
ఇది బుర్ర లేని సర్కారు..: ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఓ దుర్మార్గం. సీఎం జగన్మోహన్ రెడ్డికి బుర్ర లేదు. ఒక ఊళ్లో ఇద్దరి వ్యక్తుల మధ్య భూవివాదం నెలకొంటే ఇప్పటి వరకు సివిల్ కోర్టు పరిష్కరించేది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి అప్పీల్ అథారిటీకి వెళ్తుంది. అక్కడ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు ఉంటారు. వారు ఏనాడూ ఇక్కడి పొలం చూసి ఉండరు. రైతులతో ఒక్కసారీ మాట్లాడి ఉండరు. దీన్ని వారెలా పరిష్కరిస్తారు. అత్యధిక కేసుల్లో కింది స్థాయి అధికారులు ఏం రాస్తే దానికే వారూ కట్టుబడి నిర్ణయాలు వెల్లడిస్తారు. లంచాలు తినమరిగిన అధికారులు, రాజకీయ ఒత్తిడితో వారు తీసుకునే నిర్ణయంతో ఎంతో మంది పేద రైతులు బలవుతారు. అక్కడ న్యాయం జరగలేదనుకుంటే అప్పుడు హైకోర్టును ఆశ్రయించాలి. సన్న, చిన్నకారు రైతుల్లో ఎంత మందికి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించి హైకోర్టును ఆశ్రయించే స్థోమత ఉంటుంది. ఇన్ని వేల కేసులను హైకోర్టు పరిష్కరించడం కూడా సాధ్యం కాదు.
- బి.రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనలు తొక్కి‘పెట్టే’శారు
[ 18-05-2024]
విజయనగరం అర్బన్, గ్రామీణం: గురువారం మధ్యాహ్నం 3 గంటలు.. విజయనగరం తహసీల్దారు కార్యాలయం.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీసు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూమ్ ఉంది. -
ప్రజలకు అందుబాటులో ఉంటాం
[ 18-05-2024]
కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. -
19 నుంచి తోటపల్లిలో కల్యాణ వేడుకలు
[ 18-05-2024]
తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సీతారామస్వామి వార్షిక కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. -
ఏటా రూ.కోట్లు.. పనులకు తూట్లు
[ 18-05-2024]
సాలూరు పట్టణంలోని గాంధీనగర్ నుంచి కొంకివీధి, వేదసమాజం, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు ఉండే వన్వే దారి ఇది. అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. -
ఇదే.. సాలూరు స్మార్ట్ టౌన్షిప్
[ 18-05-2024]
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో మధ్య ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సాలూరులో పట్టణ జాతీయ రహదారి పక్కన కేటాయించింది -
ఆందోళనకు గురువులు సిద్ధం
[ 18-05-2024]
పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
రాష్ట్రంలో ఈవీఎంలకు భద్రత లేదు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యకాండను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు
[ 18-05-2024]
ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన సంఘటన శుక్రవారం గజపతినగరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది -
చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు
[ 18-05-2024]
సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. -
కన్నీటి సంద్రం
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం, జియ్యమ్మవలస, బొండపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. -
దిబ్బలపాలెంలో పులి సంచారం..?
[ 18-05-2024]
భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్చ్..ఇదేం నిర్వహణ?
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల్లో కాలువల తీరు ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట