పోస్టల్ బ్యాలెట్లు.. ఉద్యోగుల ఇక్కట్లు
పోస్టల్ బ్యాలెట్లో భాగంగా ఓట్లేసేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విద్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది.
జాబితాలో ఓట్లు లేవని చెబుతున్న ఉద్యోగులు
విజయనగరం అర్బన్, ఉడాకాలనీ, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలెట్లో భాగంగా ఓట్లేసేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విద్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎన్హెచ్- 26 నుంచి కేంద్రానికి వచ్చేందుకు సుమారు రెండు కి.మీ. రావాలి. రవాణా ఇబ్బందులతో కొందరు మండుటెండలో కాలినడకన వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో తాగునీరు లేకపోవడంతో కొందరు ఆవేదన వ్యక్తం చేయగా అప్పటికప్పుడు అక్కడున్న సిబ్బంది క్యాన్ల ద్వారా తాగునీటిని తీసుకొచ్చారు. చాలామంది పేర్లు జాబితాలో లేవు. సొంత నియోజకవర్గంలో ఓటు వేయాలని సూచించడంతో కొందరు కంగుతిన్నారు. జిల్లాలో పనిచేస్తున్న వారు విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వెళ్లాల్సి రావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ఓటరు.. ప్రస్తుతం వంగర మండల విద్యాశాఖలో పనిచేస్తున్నా.. ఇక్కడకు వచ్చి చెక్ చేస్తే తన పేరు కనిపించకపోవడంతో ఓటేయడానికి వీల్లేదని చెప్పడంతో ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులను బెదిరిస్తున్నారు: బేబినాయన
బొబ్బిలి, న్యూస్టుడే: వైకాపా నాయకులు ఉద్యోగులను బెదిరిస్తున్నారని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ ఓటు ఎవరికి వేశారన్నది బ్యాలెట్ పేపరు ఫొటో తీసి పెట్టాలని అధికార పార్టీ నాయకులు ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. దీనిపై ఆర్వో, కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి చరవాణులను అనుమతించకూడదని కోరామన్నారు. చాలామంది ఉద్యోగులు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
వాలంటీర్లతో ఓటర్ల స్లిప్పుల పంపిణీ?
పట్టణంలోని పలు వార్డుల్లో వాలంటీర్లతో ఓటర్ల స్లిప్పుల పంపిణీ గుట్టుగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు దగ్గర ఉండి పంపిణీ చేయిస్తున్నట్లు సమాచారం. సోమవారం నాలుగో వార్డులో పంపిణీ చేసినట్లు తెలిసింది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి తెరచాటుగా ప్రచారాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో రాజీనామా చేసిన వాలంటీర్లు అధికార పార్టీ ప్రచార కార్యకర్తలుగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి జగన్కు ఓటేయాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకపై.. డేగకన్ను
[ 19-05-2024]
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
జీర్ణావస్థలో జీసీసీ
[ 19-05-2024]
గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని ప్రభుత్వం ఖూనీ చేసింది. -
భూసార పరీక్షల ఫలితాలేవీ..?
[ 19-05-2024]
ఏ పంట పండించినా దిగుబడి బాగుండాలంటే భూమి సారవంతంగా ఉండాలి. దీని కోసం భూమిలో లోపాలు తెలుసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలి. దీంతో దిగుబడి పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. -
కూటమికి 160 పైగా సీట్లు ఖాయం
[ 19-05-2024]
రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమని చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం చీపురుపల్లిలోని నటరాజ్ రెసిడెన్సీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
ఉన్నవి 24 రోజులే.. నాడు-నేడు మాటేమిటి?
[ 19-05-2024]
రెండో విడత నాడు నేడు పనులు నిధుల కొరతతో 2023 అక్టోబరు నుంచి నిలిచిపోయాయి. ఏప్రిల్లో డబ్బులు విడుదలైనా సిమెంట్, ఇసుక వంటివి అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగలేదు. -
వైకాపా కదలికలపై నిఘా అవసరం
[ 19-05-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ గది తెరిచిన ఘటనపై శనివారం బంగ్లాలో పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. -
ఈ ఖరీఫ్లో కన్నీరే!
[ 19-05-2024]
కళ్లెదుటే నీళ్లున్నాయి.. చేతుల్లో డబ్బులున్నాయి.. కానీ ఫలితం లేదు.. పొలం తడవదు.. పంట పండదు.. జలాశయాల ఆధునికీకరణకు జైకా నిధులిచ్చినా.. పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లిప్తత చూపించింది. ఫలితంగా మూడేళ్లు అవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదు. -
అనంతపురం ఎస్పీగా గౌతమీశాలి
[ 19-05-2024]
విశాఖపట్నం 16 బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న గౌతమీశాలిని ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీగా నియమించింది. -
ఈఏపీసెట్లో మెరుపులు
[ 19-05-2024]
తెలంగాణ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లాల విద్యార్థులు మెరిశారు. వ్యవసాయం, ఫార్మసీ విభాగంలో బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నాగుదాసరి రాధాకృష్ణ రెండో ర్యాంకు, ఇంజినీరింగ్ విభాగంలో విజయనగరానికి చెందిన దనుకొండ శ్రీనిధి పదో ర్యాంకు పొందారు. -
స్ట్రాంగ్ రూం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదు
[ 19-05-2024]
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM