AP News: ఎమ్మెల్యే సోదరుడు- విద్యుత్తు ఈఈ ఆడియో వైరల్
జిల్లాలో ఓ శాసనసభ్యుడి సోదరుడు, విద్యుత్తు శాఖ ఈఈ మధ్య జరిగిన సంభాషణ ఆడియో కలకలం సృష్టించింది. 5 రోజుల క్రితం జరిగినట్లు చెబుతున్న ఈ సంభాషణ బుధవారం లీకు కాగా.. క్రమశిక్షణ చర్యల కింద అధికారిని ఆ శాఖ గురువారం సస్పెండ్ చేసింది. వివరాలివి. ఓ శాసనసభ్యుడి సోదరుడు కనిగిరి డివిజనల్ ఈఈ
అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
ఈనాడు డిజిటల్, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఓ శాసనసభ్యుడి సోదరుడు, విద్యుత్తు శాఖ ఈఈ మధ్య జరిగిన సంభాషణ ఆడియో కలకలం సృష్టించింది. 5 రోజుల క్రితం జరిగినట్లు చెబుతున్న ఈ సంభాషణ బుధవారం లీకు కాగా.. క్రమశిక్షణ చర్యల కింద అధికారిని ఆ శాఖ గురువారం సస్పెండ్ చేసింది. వివరాలివి. ఓ శాసనసభ్యుడి సోదరుడు కనిగిరి డివిజనల్ ఈఈ ఎం.భాస్కరరావుకు ఫోన్ చేశారు. కురిచేడు మండలం బోదనంపాడులో ఉన్న తమ భూములకు విద్యుత్తు సరఫరా ఇచ్చే విషయమై ఇంతవరకు సామగ్రి రాలేదని ప్రస్తావించారు. ఒక నెలలో చేయిస్తామని ఎస్ఈ చెప్పారని ఈఈ గుర్తుచేశారు. డబ్బులు కట్టి ఇన్ని రోజులవుతుంటే రోజుకో కథ చెబుతున్నారంటూ ఆ నేత అనగా.. వ్యవసాయానికి ప్రాధాన్యం ప్రకారం చేస్తామని అధికారి బదులిచ్చారు. ఈ క్రమంలో ‘ఏందీ.. నువ్వు తమాషా చేస్తున్నావ్’ అని నేత అనడంతో ‘నువ్వు.. నువ్వు.. అనకండి. మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరు ఎమ్మెల్యే సోదరుడు అయినంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగన్న గౌరవం లేకుండా మాట్లాడతారా? మీ పని ఎస్ఈ గారి పరిధిలోనిదని మీకు తెలుసు. ఈఈ అనుకుంటున్నారా? ఇంట్లో పాలేరు అనుకుంటున్నారా?’ అంటూ అధికారి ప్రశ్నించారు. ఈ సంభాషణ ఆడియో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘించడంతో పాటు ఉద్యోగ రీత్యా క్రమశిక్షణ రాహిత్యం వహించారంటూ ఈఈ భాస్కర్రావును సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కేవీజీ సత్యనారాయణ ఉత్తర్వులిచ్చారు. ఆ వెంటనే కనిగిరి ఇన్ఛార్జి ఈఈగా పొదిలి డీఈఈ ఎ.సత్యనారాయణను నియమించారు. ఈ క్రమంలోనే సస్పెండైన భాస్కరరావు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను గురువారం కలవడం గమనార్హం. తాను తప్పు చేయలేదని, ఎమ్మెల్యే సోదరుడితో మామూలుగానే మాట్లాడానని ఈఈ భాస్కరరావు ‘న్యూస్టుడే’తో అన్నారు. ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని, ఆ కాపీ అందలేదని తెలిపారు. సీఎండీ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్తానని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM