logo

గొంతు కోసుకుని.. భవనం పైనుంచి దూకి

కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామానికి చెందిన పురిణి బ్రహ్మయ్య(38)కు మతిస్థిమితం అంతంతమాత్రం. ఈ నెల 12న పెళ్లూరు సమీపంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం

Published : 18 Jan 2022 02:39 IST

 చికిత్స పొందుతూ మతిస్థిమితం లేని వ్యక్తి దుర్మరణం

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామానికి చెందిన పురిణి బ్రహ్మయ్య(38)కు మతిస్థిమితం అంతంతమాత్రం. ఈ నెల 12న పెళ్లూరు సమీపంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు అతన్ని చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఒక ప్రైవేట్‌ వైద్యశాలలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున వైద్యశాల భవనం పైనుంచి కిందకు దూకాడు. కాళ్లూ చేతులు విరిగిపోవటంతో పాటు తలకు బలమైన గాయమైంది. దీంతో అతన్ని నగరంలోనే మరొక వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రహ్మయ్య సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒంగోలు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని