పాలనా దక్షతకు నిదర్శనం టంగుటూరి
టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. టంగుటూరి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని విగ్రహానికి శుక్రవారం ఉదయం కలెక్టర్తో పాటు జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి
ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్ దినేష్కుమార్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. టంగుటూరి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని విగ్రహానికి శుక్రవారం ఉదయం కలెక్టర్తో పాటు జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జేసీ అభిషిక్త్ కిషోర్, ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వీసీ జయరామిరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధైర్యం, త్యాగం, పరిపాలనా దక్షతకు ప్రకాశం పంతులు నిదర్శనమన్నారు. ఆయన చూపిన మార్గంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గోపాలకృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో పులి శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, ఒంగోలు కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పర్యవేక్షకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రులకు పట్టని ప్రకాశం
టంగుటూరి వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రులు విస్మరించడం చర్చనీయాంశమైంది. ఒంగోలులోని కలెక్టరేట్లో ఉదయం అధికారులు, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఉదయం 11 తర్వాత ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున, పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. సమావేశం అనంతరం ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రులు నివాళులర్పిస్తారన్న ఉద్దేశంతో అధికారులు పూలమాలలు తెప్పించారు. అయితే వారిద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయారు. కనీసం విగ్రహం వైపు కన్నెత్తి చూడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’
[ 07-05-2024]
ఏటా జాబ్ క్యాలెండర్..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. -
‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. -
ఓటేయకుంటే... గొంతులూ తడపం
[ 07-05-2024]
గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. -
అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
[ 07-05-2024]
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు. -
కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు
[ 07-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను అంతమొందిద్దాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. -
అధికారం ఉన్నోడిదే భూమి!
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. -
తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
[ 07-05-2024]
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య