దొంగ బంగారం.. ఒంగోలులో కలకలం
ఒంగోలు నగరంలో కొందరు వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి దొంగ బంగారం తీసుకొచ్చి విక్రయిస్తున్న దాఖలాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో కొందరు వ్యాపారులు రూ.5 కోట్ల నగదుతో గుమ్మిడింపూడి సమీపంలో తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డారు.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలు నగరంలో కొందరు వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి దొంగ బంగారం తీసుకొచ్చి విక్రయిస్తున్న దాఖలాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో కొందరు వ్యాపారులు రూ.5 కోట్ల నగదుతో గుమ్మిడింపూడి సమీపంలో తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డారు. అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించడమే గాక రాజకీయంగా దుమారం సృష్టించింది. తాజాగా మరో ఉదంతం వెలుగుచూసింది. ఒంగోలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమిళనాడులోని మన్నడి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇది హవాలా డబ్బుగా గుర్తించి బి-1 నార్త్కోర్టు పోలీస్ స్టేషన్కు తరిలించి విచారణ చేపట్టారు. పట్టుబడినవారిలో ఒంగోలు దక్షిణం బజారుకు చెందిన వ్యక్తితోపాటు కేశవస్వామిపేటకు చెందిన డ్రైవర్ ఉన్నారు. ప్రధాన నిందితుడు దక్షిణం బజారులో మిఠాయి దుకాణం నిర్వహిస్తున్నారు. తరచూ తమిళనాడుకు వెళ్లి అక్కడ హోల్సేల్గా బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి ఒంగోలులో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇది నిత్యం జరిగే తంతుగా మారింది. ఎప్పటి మాదిరిగానే వెళ్లిన క్రమంలో అక్కడి పోలీసులకు అందిన సమాచారంతో నిందితులు పట్టుబడ్డారు.
ఇంకా మరికొందరు...
ఈ మొత్తం వ్యవహారం ఒంగోలు వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. వ్యాపారంలో సాధారణ లావాదేవీలు నిర్వహించాలంటే దానికి తగిన పద్ధతి పాటించాలి. ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంది. ఇది తమకు నష్టంగా మారుతుందని భావించి కొందరు ఈ తరహాలో దొంగ బంగారం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒంగోలులో ఇలా 10 మంది వ్యక్తులు నిత్యం తమిళనాడు నుంచి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.