కక్ష గట్టి ఉద్యోగం నుంచి తొలగించారు..
ఇటీవల వైకాపా ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభపై ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి మాట్లాడిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశానన్న ఆరోపణలతో మీటర్స్ రీడర్స్గా విధులు నిర్వహిస్తున్న తనను వైకాపా
స్పందనలో తెదేపా సానుభూతిపరుడి ఆవేదన
దరఖాస్తుదారులతో మాట్లాడుతున్న ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి
మార్కాపురం, న్యూస్టుడే: ఇటీవల వైకాపా ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభపై ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి మాట్లాడిన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశానన్న ఆరోపణలతో మీటర్స్ రీడర్స్గా విధులు నిర్వహిస్తున్న తనను వైకాపా నాయకులు కక్ష కట్టి విధుల నుంచి తొలగించారని పెద్దారవీడు మండలంలోని తమ్మడపల్లె గ్రామానికి చెందిన తెదేపా సానుభూతి నక్కా శ్రీను స్పందనలో ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి ఎదుట వాపోయాడు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ స్పందనలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డితో కలిసి వినతిపత్రాన్ని నక్కా శ్రీను ఆర్డీవోకి అందజేశారు పూర్తి స్థాయిలో విచారణ చేసి చిరు ఉద్యోగినైనా తనకు న్యాయం చేయాలని కోరారు. మండలంలోని నికరంపల్లె గ్రామానికి చెందిన జంకె వెంకటరెడ్డి అనే రైతు తన భూమి వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గొట్టిపడియ నిర్వాసిత కాలనీకి తీసుకుందని, అయితే అప్పట్లో అధికారులు తన భూమిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల మరొక రైతు పేరున ప్రాజెక్టు అధికారులు ఇచ్చిన పరిహారం అవార్డును మంజూరు చేశారని, అయితే ఆ పరిహారం తనకు మంజూరు చేయాలని ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు. సోమవారం నిర్వహించిన స్పందనలో 12 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో కార్యాలయ అధికారులు తెలిపారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దారు ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’
[ 07-05-2024]
ఏటా జాబ్ క్యాలెండర్..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. -
‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. -
ఓటేయకుంటే... గొంతులూ తడపం
[ 07-05-2024]
గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. -
అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
[ 07-05-2024]
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు. -
కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు
[ 07-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను అంతమొందిద్దాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. -
అధికారం ఉన్నోడిదే భూమి!
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. -
తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
[ 07-05-2024]
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్