ముసి రక్షణ గోడను ఢీకొన్న కారు
వేగంగా వెళుతున్న కారు టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపు తప్పి వాగు రక్షణ గోడను ఢీకొని నిలిచిపోవడంతో త్రుటిలో ముప్పు తప్పింది.
త్రుటిలో తప్పిన ముప్పు
ప్రమాదంలో దెబ్బతిన్న కారు
వేలూరు (పొదిలి గ్రామీణం), న్యూస్టుడే: వేగంగా వెళుతున్న కారు టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపు తప్పి వాగు రక్షణ గోడను ఢీకొని నిలిచిపోవడంతో త్రుటిలో ముప్పు తప్పింది. ఈ సంఘటన వేలూరు ముసి వాగు బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు టి.సళ్లూరు గ్రామానికి చెందిన వెలుతుర్ల వెంకటేశ్వర్లు సోమవారం తన కారులో మర్రిచెట్లపాలెం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ముసి వాగు వంతెన వద్దకు వచ్చేసరికి కారు టైరు పంక్చర్ అయ్యి అదుపుతప్పి గోడను బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. రక్షణ గోడ స్వల్పంగా దెబ్బతింది. వాహనచోదకుడికి ఎలాంటి గాయాలు కాలేదు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సిద్ధవరం (కొనకనమిట్ల), న్యూస్టుడే: కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం వ్యవసాయ భూముల వద్ద సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని ఎస్సై దీపిక తెలిపారు. వయస్సు 45 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహంపై తెల్లచొక్కా ఉందన్నారు. వివరాలకు స్టేషన్కు సంప్రదించాలన్నారు.
యువ వ్యాపారి బలవన్మరణం
దర్శి, న్యూస్టుడే: దర్శి పట్టణంలో కురిచేడు రోడ్డులో పండ్ల వ్యాపారం చేస్తున్న యువ వ్యాపారి (24) పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మండలంలోని ఒక గ్రామానికి చెందిన అతడు దర్శిలో నివాసం ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. అతడికి వివాహమైంది. భార్య, కుమార్తె ఉన్నారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు తొలుత స్థానికంగా ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అనంతరం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
లారీ ఢీకొని దుర్మరణం
సంతనూతలపాడు (మద్దిపాడు), న్యూస్టుడే: లారీ ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. జాతీయ రహదారిపై మద్దిపాడు మండలం గ్రోత్సెంటర్ కూడలిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జె.పంగులూరు మండలం బైటమంజులూరుకు చెందిన నల్లమద్ది కిషోర్ (40)... గ్రోత్సెంటర్ కూడలి వద్ద ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో... గుంటూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
గల్లంతైన యువకుడు మృతి
కొత్తపట్నం, న్యూస్టుడే: గుండమాల తీరంలో గల్లంతైన మరో యువకుడు కూడా మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం... కె.పల్లెపాలెం వద్ద సముద్ర స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి జితేంద్ర మృతదేహం వెంటనే లభ్యమైంది. మరో యువకుడు అవనిగడ్డ కార్తిక్ (23) మృతదేహం... సోమవారం సాయంత్రం తీరానికి కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.
రైలు కిందపడి...
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఒకరు మృతి చెందారు. ఒంగోలు రైల్వేస్టేషన్కు సమీపంలో పోతురాజు కాలువ వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు యాభై ఏళ్లు ఉంటుందని ఒంగోలు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. నెల్లూరు - విజయవాడ, విజయవాడ - ఒంగోలు, ఒంగోలు- సికింద్రాబాద్, సికింద్రాబాద్ - ఒంగోలు జనరల్ బోగీల్లో ప్రయాణించిన టిక్కెట్లు లభ్యమయ్యాయి. ఇతర ఆధారాలేవీ లభించకపోవడంతో ఎవరన్నదీ తెలియరాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ శవాగారానికి తరలించారు. జీఆర్పీ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!