ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను లాగేసుకున్నావు
వైకాపా సర్కార్పై మండిపడుతున్న సర్పంచులు
నేడు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులకు పవర్ లేకుండా చేశారు. పంచాయతీల్లో ఉన్న నిధులను ప్రభుత్వం ఇష్టానుసారంగా వారి అనుమతి లేకుండా తీసుకొని వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, పంచాయతీల్లో వివిధ నిర్మాణాలకు మళ్లించి పంచాయతీల్లో ఒక్క చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి సర్పంచులను ఖాళీ గా కూర్చీల్లో కూర్చొబెట్టారు. ఒక్కొక్కపంచాయతీలో సర్పంచులకు తెలియకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు కూడా వైకాపా సర్కార్ తీసుకొని ఇతర వాటికి మళ్లించింది. సర్పంచులు ఆందోళనలు, నిరసనలు చేసినా పట్టించుకోలేదు.
మార్కాపురం, గిద్దలూరు పట్టణం, త్రిపురాంతకం, కొనకనమిట్ల, న్యూస్టుడే
చిన్న సమస్యను తీర్చలేకపోయాం
పంచాయతీలో చిన్న సమస్యను పరిష్కరించ లేకపోయాం. మా పంచాయతీ పరిధిలో సుమారు రూ.30లక్షల పంచాయతీ నిధులను ప్రభుత్వమే తీసేసుకోవడంతో చిన్న పాటి పనులు చేపట్టేందుకు నిధులు లేక కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితి దాపురించింది.
కర్నాటి రామసుబ్బారెడ్డి, సర్పంచి, కొమ్మునూరు
అప్పుల పాలయ్యాం
గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాం. గ్రామంలో రోడ్డు వేయడం కాదు కదా.. నీటిని అందించలేని దుస్థితిలో ఉన్నాం. అప్పు చేసి గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. వాటికి నిధులు రాక అప్పుల పాలయ్యాం.
పాతకోటి వెంకట సుబ్బారావు, ఉప సర్పంచి, పాత అన్నసముద్రం, త్రిపురాంతకం మండలం.
ఆర్ధిక సంఘం నిధులు పక్కదారి..
గ్రామాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించలేక, వారికి సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నాం. గ్రామాల్లో వాటర్ ట్యాంకర్ల బిల్లులకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంది. అవాటికి కూడా పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
రావిళ్ల సుధాకర్, సర్పంచ్, మిరియంపల్లి, త్రిపురాంతకం మండలం
హక్కులను కాలరాశారు
మా హక్కులు కాలరాస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సర్పంచులకు తెలియకుండా పనులు చేస్తూ వాటి బిల్లులు చేయాలని మాపై అనేక సార్లు ఒత్తిడి చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నాం. వారికి ఏడాది నుంచి ఇవ్వాల్సి ఉంది.
కె.భాగ్యమ్మ, సర్పంచి, రాయవరం
పనులకు పైసలు లేవు
తాగునీరు, ఇతర పనులు చేసి రూ.7లక్షలు ఖర్చు చేసి రెండు సంవత్సరాలైంది. నిధులు మంజూరు చేయకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నిధులు లేక ఏం చేయలేకపోతున్నాం. సిమెంట్ రహదారులు, తాగునీటి, ఇతర సమస్యలు చేయాలనుకున్నాం.
వెంకటనారాయణ , సర్పంచి, వింజవర్తిపాడు, కొనకనమిట్ల మండలం
ప్రగతి శూన్యం
మూడేళ్లుగా ప్రభుత్వం పైసా కేటాయించలేదు. నిధుల్లేక గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిధులు అన్ని వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నాను. నిధులు ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.
గోగిరెడ్డి పార్వతమ్మ, సర్పంచి, నికరంపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్ హిట్.. తెదేపా శ్రేణుల్లో జోష్
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పొదిలి, గిద్దలూరులో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. -
జనం చూస్తే నాకేంటి!
[ 04-05-2024]
పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు. -
జగన్కు జిల్లా ‘రివర్స్’ షాక్
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి జిల్లాలో జనం ‘రివర్స్’ షాక్లిస్తున్నారు. ఇటీవల టంగుటూరులో మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కోరుతూ జగన్ ప్రచారం చేశారు. -
ఏలికా.. మా ఉసురు తగలదా!
[ 04-05-2024]
ఎన్నికల వేళ లబ్ధికి జగన్ తెర లేపిన వికృత రాజకీయ క్రీడకు పండుటాకులు విలవిల్లాడుతున్నారు. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అవ్వాతాతలను బ్యాంక్లకు రప్పించారు. -
నిత్యం పరేషాన్
[ 04-05-2024]
ఇంటింటికీ ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు.. సమయ పాలన ఉండదు. -
సేవకుడిని కాదని స్మగ్లర్కు వైకాపా సీటు
[ 04-05-2024]
సైకో జగన్ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదని తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి సీటిచ్చారు. తాతల నాటి ఆస్తులను కొట్టేసేందుకు భూరక్షణ చట్టం తెచ్చారు. -
వైకాపాను ఓడించకపోతే.. యువతకు ఉపాధి కష్టమే
[ 04-05-2024]
వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. -
తపాలా ఓట్లకు ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 04-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఫ్లోరైడ్ ఊసెత్తక.. నిమ్జ్ మాటెత్తక..
[ 04-05-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. కనిగిరి ప్రాంత సమస్యలపై గట్టి హామీలిస్తారని..తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. -
తెదేపాలోకి ఇద్దరు కార్పొరేటర్లు
[ 04-05-2024]
ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు పార్టీలోకి చేరగా, శుక్రవారం మరో ఇద్దరు కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు. -
పశ్చిమ ప్రకాశానికి వరాల జల్లు
[ 04-05-2024]
మండు వేసవిలో చంద్రన్న కురిపించిన వరాల జల్లుతో పొదిలివాసులు పులకరించారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ ఇచ్చిన ఒక్కో హామీకి చప్పట్లు చరిచి వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
నీళ్లో.. జగనన్నా!
[ 04-05-2024]
గిద్దలూరు నగరపంచాయతీవాసులు గత పదిహేను రోజులుగా తాగునీటికి అల్లాడుతున్నారు. నగరపంచాయతీ పరిధిలో ఉన్న డీప్బోర్లలో రోజుకో ప్రాంతంలో నీరు అడుగంటడంతో సమస్య తీవ్రతరమవుతోంది. -
కారు ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 04-05-2024]
కారు ఢీకొని ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచర్లవారిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!