logo

కోడ్‌ పక్కన పెట్టి..!

ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కోడ్‌కు విరుద్ధంగా పార్టీల తరఫున ప్రచారాల్లో పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా అవన్నీ పట్టించుకోవడం లేదు.

Published : 30 Mar 2024 04:40 IST

ప్రచారంలో పాల్గొన్న రామకృష్ణ

ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కోడ్‌కు విరుద్ధంగా పార్టీల తరఫున ప్రచారాల్లో పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా అవన్నీ పట్టించుకోవడం లేదు. జిల్లాలో పలుచోట్ల నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. తాజాగా ఆమదాలవలస వైకాపా అభ్యర్థి, స్పీకరు తమ్మినేని సీతారాం పొందూరు మండలంలో ప్రచారం సాగించారు. ఇందులో ఎచ్చెర్ల పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో అటెండర్‌గా పనిచేస్తున్న అనకాపల్లి ఆదిలక్ష్మి, ఆమె భర్త రామకృష్ణ పాల్గొన్నారు. దీనిపై తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఎంపీడీవో రమాదేవికి ఫిర్యాదు చేశారు.

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

ప్రచారంలో పాల్గొన్న ఆదిలక్ష్మి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని