మద్యం మత్తులో కత్తితో దాడి
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని ఒకరిపై దాడిచేయగా దానిని అడ్డుకోబోయిన మరో యువకుడిని కత్తితో పొడిచి మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు వీరంగం సృష్టించారు.
ముగ్గురు వ్యక్తుల వీరంగం
చికిత్స పొందుతున్న గేదెల రాము
పొందూరు, న్యూస్టుడే: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని ఒకరిపై దాడిచేయగా దానిని అడ్డుకోబోయిన మరో యువకుడిని కత్తితో పొడిచి మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు వీరంగం సృష్టించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి పొందూరు మండలంలోని రాపాక కూడలి సమీపంలో ఉన్న మద్యం దుకాణం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి సుమారు 9:30 గంటలకు ఎరుకుల కాలనీకి చెందిన గేదెల రమణ అనే వ్యక్తి మద్యం దుకాణం సమీపంలో రహదారి పక్కన గల కల్వర్టుపై కూర్చొన్నాడు. అదే సమయంలో పొందూరు పట్టణానికి చెందిన సిరిపురపు ఈశ్వరరావు, వాసు, చక్రి అనే యువకులు మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వచ్చారు. కూర్చున్న రమణ వద్ద నుంచి డబ్బులు, సెల్ఫోను లాక్కోడానికి యత్నించడంతో గట్టిగా కేకలు వేశాడు. దీంతో సమీపంలోని ఆయన సోదరుడు రాము, కుటుంబ సభ్యులతో దుండగులను నిలువరించడానికి ప్రయత్నించారు. ఇంతలో ఈశ్వరరావు తన దగ్గరున్న కత్తితో రాము పొత్తికడుపు, పక్కటెముకల్లో పొడిచారు. క్షతగాత్రుడిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వై.రవికుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!