logo

అచ్చెన్న సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా శ్రేణులు

టెక్కలి మండలం పెద్దసానకు చెందిన వైకాపా నేతలు, అభిమానులు సోమవారం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో ఆ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరారు.

Published : 16 Apr 2024 04:59 IST

పెద్దసాన వైకాపా కార్యకర్తలను తెదేపాలోకి ఆహ్వానిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: టెక్కలి మండలం పెద్దసానకు చెందిన వైకాపా నేతలు, అభిమానులు సోమవారం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో ఆ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరారు. గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌, మౌళి, ఇప్పిలి రాంబాబు, చందు, షణ్ముఖరావు, తేజ, జయవర్ధన్‌, రాణి, మణి, అభి, బలుసాకు, రిక్కీ, శివలతో పాటు సుమారు 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వీరందరికీ పేరుపేరునా అచ్చెన్నాయుడు ఆహ్వానం పలికారు. ః సంతబొమ్మాళి మండలం కోటపాడు పంచాయతీ కాశీపురం నుంచి పలువురు వైకాపా నేతలు తెదేపాలో చేరారు. గ్రామానికి చెందిన వేణుగోపాల్‌, గొనప వైకుంఠరావు, సీపాన కృష్ణమూర్తి తదితరులు చేరారు. నిమ్మాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని