పిడుగుపాటుకు మహిళ మృతి
పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటు చేసుకుంది
గార, న్యూస్టుడే: పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వత్సవలస పంచాయతీ మొగదాలపాడు గ్రామానికి చెందిన కుందు భాగ్యలక్ష్మి (39) బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆరేసిన దుస్తులు తీసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురయ్యారు. ఈమె భర్త సూరిబాబు చేపల వేట సాగిస్తుంటారు. వీరికి కుమార్తె ఉంది. భాగ్యలక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని గార ఎస్సై కె.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భర్త పార్లమెంటుకు.. భార్య అసెంబ్లీకి పోటీ
[ 01-05-2024]
చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పోలాకి మండలం యాట్ల బసివలస గ్రామానికి చెందిన కాయ దుర్గారావు, ఆయన భార్య కామేశ్వరి నరసన్నపేటలోని పెద్దపేట సమీపంలో చేపలు విక్రయిస్తుంటారు. -
కర్కశ ప్రభుత్వమా.. కనిపించదా కష్టం..!
[ 01-05-2024]
రాజకీయంగా లబ్ధి పొందాలనే దురాలోచనతో అధికార పార్టీ ఆడిస్తున్న వికృత క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతోంది. ఇంటి వద్దే పింఛన్లు అందజేసే అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేసి.. జగన్ సర్కారుకు లబ్ధి చేకూర్చాలనే శైలిలో వ్యవహరిస్తోంది. -
గిరిబిడ్డలు గుర్తులేరా
[ 01-05-2024]
కొత్తూరు మండలం కారిగూడ, అడ్డంగి, గొట్టిపల్లి, అల్తీ, తదితర పంచాయతీల్లో 1,600 మందిపైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరి కొత్తూరు, కురిగాం, నివగాం గ్రామాల్లో బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే ఆయా గ్రామాల నుంచి ఆటోలు, బస్సులే దిక్కు. -
ఖాదీ బతుకులంటే చిన్న చూపా..?
[ 01-05-2024]
‘అత్యున్నత ప్రమాణాలున్న సన్నఖాదీ పొందూరు సొంతం. ఏడు దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుతోంది. మహాత్మాగాంధీ నుంచి అమెరికా పూర్వ అధ్యక్షుడు బిల్క్లింటన్ వరకు దీన్ని మెచ్చినవారే.. ఇంతటి ఖ్యాతి ఉన్న ఈ ఖాదీకి ఆ స్థాయిలో చేయూత అందలేదు. -
సైకిలెక్కుతున్న జగనన్న సైన్యం..!
[ 01-05-2024]
-
4 నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 01-05-2024]
ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో జిల్లా అంతటా ఒకే చోట పోస్టల్ బ్యాలెట్ను వినియోగించారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కొరడా..!
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తనిఖీలను ముమ్మరం చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 01-05-2024]
ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలు వెళ్లగొట్టి యువతకు ఉపాధి లేకుండా చేశారని ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు అన్నారు. -
పాలన పూర్తి.. పనులు అసంపూర్తి..!
[ 01-05-2024]
జిల్లా పరిపాలనకు కలెక్టర్ కార్యాలయం గుండె వంటిది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్లు గడిచినా నగరంలోని కలెక్టరేట్ భవనాల నిర్మాణం పూర్తికాలేదు. నిధులు సకాలంలో విడుదల చేయక పోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. -
ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పాలకులను ఓడించండి
[ 01-05-2024]
ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పాలకులను ఓడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. -
నిష్పక్షపాతంగా పని చేయండి
[ 01-05-2024]
ఎన్నికల సిబ్బందిపై ఎంతో గురుతర బాధ్యత ఉందని, ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పని చేయాలని వ్యయ పరిశీలకులు శరవణకుమార్, కోమల్ జీత్ మీనా, నవీన్కుమార్ సోనీ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు