logo

‘ప్రజలకు మేలు చేయని డీఎంకే ’

రాష్ట్రంలో పాలనలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఏ మేలు చేయలేదని అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ విమర్శించారు. విరుదునగర్‌ బస్టాండు సమీపంలో విరుదునగర్‌ నియోజకవర్గ అన్నాడీఎంకే తరఫున అన్నాదురై

Published : 25 Sep 2022 01:35 IST

సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ

వేలచ్చేరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పాలనలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఏ మేలు చేయలేదని అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ విమర్శించారు. విరుదునగర్‌ బస్టాండు సమీపంలో విరుదునగర్‌ నియోజకవర్గ అన్నాడీఎంకే తరఫున అన్నాదురై జయంతిని పురస్కరించుకుని బహిరంగ సభను శుక్రవారం రాత్రి నిర్వహించారు. పశ్చిమ జిల్లా ప్రిసీడియం ఛైర్మన్‌ ఎస్‌ఆర్‌ విజయకుమరన్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రబాలాజీ మాట్లాడుతూ... రాష్ట్రంలో కామరాజర్‌ పాలనలో అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంజీఆర్‌ విస్తరించారని గుర్తుచేశారు. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం జయలలిత ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందన్నారు. నగర కార్యదర్శి మహ్మద్‌ నాయినార్‌, యూనియన్‌ కార్యదర్శులు కె.కన్నన్‌, ధర్మలింగం, నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని