విద్వేష శక్తులకు ఇక్కడ చోటులేదు: సీఎం
విద్వేష శక్తులకు రాష్ట్రంలో చోటులేదని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎగ్మూరులోని ప్రభుత్వ మ్యూజియం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివారం గవర్నర్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు.
గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన గవర్నర్ రవి, సీఎం స్టాలిన్ తదితరులు
చెన్నై, న్యూస్టుడే: విద్వేష శక్తులకు రాష్ట్రంలో చోటులేదని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎగ్మూరులోని ప్రభుత్వ మ్యూజియం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివారం గవర్నర్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు, మేయర్ తదితరులు కూడా నివాళి అర్పించారు. సర్వోదయ సంఘం విద్యార్థులు నిర్వహించిన భజన, రాట్నంలో నూలు వడికే ప్రదర్శనను గవర్నర్, సీఎం తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ ట్వీట్ చేశారు. విభేదాలు అధిగమించి ప్రేమ, శాంతిని వెలుగొందించే సమాజంగా భారత్ను రూపొందించడానికి మహాత్మాగాంధీ కృషి చేశారని తెలిపారు. ఆయన జయంతి రోజు ఈ గడ్డపై సమానత్వం, సోదరభావం నెలకొనాలని ఆకాంక్షించారు. విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు ఇక్కడ చోటులేదన్నారు. ఇది గాంధీ నేలగా ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని గ్రామోద్యోగ్ భవన్లో ఉన్న గాంధీ చిత్రపటానికి గవర్నర్ నివాళి అర్పించారు. తర్వాత ఖాదీ చీరల విక్రయాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి గాంధీ తదితరులు పాల్గొన్నారు. రాజ్భవన్ ప్రాంగణంలో గాంధీ చిత్రపటానికి గవర్నర్ రవి, ఆయన సతీమణి లక్ష్మీ నివాళి అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం