వంద సభల నిర్వహణకు నిర్ణయం
డీఎంకే దివంగత ప్రధానకార్యదర్శి అన్బళగన్ శతజయంతి ముగింపు వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం తీర్మానించింది.
సమావేశంలో ప్రసంగిస్తున్న స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: డీఎంకే దివంగత ప్రధానకార్యదర్శి అన్బళగన్ శతజయంతి ముగింపు వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం తీర్మానించింది. అధ్యక్షుడైన ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన గురువారం ఈ కార్యక్రమం జరిగింది. తేనాంపేటలోని పార్టీ ప్రధానకార్యాలయమైన అన్నా అరివాలయం వేదికైంది. అన్బళగన్ శతజయంతి ప్రారంభ వేడుకల సందర్భంగా చెన్నై నందనంలోని సమీకృత న్యాయశాఖ ప్రాంగణంలో గత ఏడాది డిసెంబరు 19న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ప్రాంగణానికి ‘పేరాసిరియర్ అన్బళగన్ మాళిగై’ పేరు పెట్టినందుకు స్టాలిన్కు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. డీపీఐ ప్రాంగణంలోనూ అన్బళగన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు, ఆ ప్రాంగణానికి ‘పేరాసిరియర్ అన్బళగన్ కల్వి వళాగం’ అని పేరు పెట్టనున్నట్టు ప్రకటించడంపైనా హర్షం వ్యక్తం చేసింది. శతజయంతి ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 15వ తేదీన 100 ప్రత్యేక బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించారు. అన్నా అరివాలయంలోని కలైజ్ఞర్ ఆడిటోరియంలో 17వ తేదీన అన్బళగన్ జీవితాన్ని కీర్తించేలా కవి సమ్మేళనం, 18న ఉత్తర చెన్నైలో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ నేతలతో సమావేశం, 19న పార్టీలోని విభాగాలు. అనుబంధ సంస్థల తరఫున అన్బళగన్కు నీరాజనాలు అర్పించాలని తీర్మానించారు. సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి దురైమురుగన్, కోశాధికారి టీఆర్ బాలు, ఉప ప్రధానకార్యదర్శి కనిమొళి, జిల్లా కార్యదర్శులు సుబ్రమణియన్, శేఖర్బాబు, మాధవరం సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!