logo

ఉప ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే నేతలు

ఈరోడ్డు (తూర్పు) నియోజకవర్గంలో వచ్చే నెల 27వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి పేరును ఆ పార్టీ నిర్వాహకం పరిశీలిస్తోంది.

Published : 29 Jan 2023 01:32 IST

జాబితాలో ఓటర్ల వివరాలను సరిచూస్తున్న  సోమసుందరం తదితరులు

కాంచీపురం, న్యూస్‌టుడే: ఈరోడ్డు (తూర్పు) నియోజకవర్గంలో వచ్చే నెల 27వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి పేరును ఆ పార్టీ నిర్వాహకం పరిశీలిస్తోంది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆదేశాల మేరకు కాంచీపురం పశ్చిమ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి వి.సోమసుందరం, మాజీ జిల్లా కార్యదర్శి వాలాజాబాద్‌ పి.గణేశన్‌ తదితరులు ఈరోడ్డు తూర్పు నియోజక వర్గంలో ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. వారికి కేటాయించిన ప్రాంతాల్లో శనివారం ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాల్లో గల ఓటర్ల పేర్లను, చిరునామా మొదలైన వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో అన్నాడీఎంకే నిర్వాకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని