మహిళలకు రాష్ట్రం సురక్షితం
మహిళలకు అత్యంత సురక్షితంగా రాష్ట్రం ఉందని డీజీపీ శైలేంద్ర బాబు తెలిపారు.
మాట్లాడుతున్న డీజీపీ శైలేంద్ర బాబు
ప్యారిస్, న్యూస్టుడే: మహిళలకు అత్యంత సురక్షితంగా రాష్ట్రం ఉందని డీజీపీ శైలేంద్ర బాబు తెలిపారు. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా నేరాలను అడ్డుకొని నవ భారతాన్ని సృష్టిద్దామనే అవగాహన కార్యక్రమం చెన్నై నుంగంబాక్కంలో ఉన్న లయోలా కళాశాలలో జరిగింది. దీన్ని డీజీపీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థినులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు జరిగాయి. విజేతలకు డీజీపీ బహుమతులు అందించి, అభినందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ....పుస్తకం, కలం మాత్రమే మహిళలకు సురక్షితమైన ఆయుధాలన్నారు. దేశంలో మహిళలకు సురక్షితమైన రాష్ట్రం తమిళనాడు అని ఓ అధ్యయనంలో తెలిసిందన్నారు. వారికి సంబంధించిన కేసుల్లో వెంటనే తగిన చర్యలు చేపట్టి కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు తమ వ్యక్తిగత రహస్యాలు, సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోకూడదని, ఎవరైనా బెదిరింపులకి పాల్పడితే వెంటనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఇలాంటి నేరాలను విచారించేందుకు సైబర్ క్రైం విభాగం పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారుల భద్రతా విభాగ అదనపు డీజీపీ కల్పన నాయక్, డిప్యూటీ¨ కమిషనరు వనిత, సహాయ కమిషనరు కలైసెల్వన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం