ముడి సరకుల తయారీపై పరిశోధన
పంట వ్యర్థాలతో ‘ఎకో ఫ్రెండ్లీ’ సాంకేతికత ద్వారా పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే ముడి సరకులను తయారు చేసేందుకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీ ఎం) పరిశోధకులు ఆలోచనలు ప్రారంభించారు.
కార్బన్ గుళికలు
వడపళని, న్యూస్టుడే:పంట వ్యర్థాలతో ‘ఎకో ఫ్రెండ్లీ’ సాంకేతికత ద్వారా పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే ముడి సరకులను తయారు చేసేందుకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీ ఎం) పరిశోధకులు ఆలోచనలు ప్రారంభించారు. ఈ విధానంతో రైతులు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాలున్నాయి. సేంద్రియ వ్యర్థాలు, పంట వ్యర్థాలతో వెలువడే కార్బన్ నుంచి పారిశ్రామిక రంగానికి ఉపయోగపడే ముడి సరకును తయారు చేసేందుకు ‘ఫార్మ్ ఎనర్జీ సినర్జీ’ విధానంతో పరీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏడాదికి 760 లక్షల మెట్రిక్ టన్నుల వరి వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. వ్యర్థాలను తగులబెట్టడంతో పర్యావరణం కాలుష్యమవుతోంది. బయో వ్యర్థాలను బయోమాస్ (కాయగూరల వ్యర్థాలు వంటివి)గా మార్చడంపై ఐఐటీఎం పరిశోధకులు ఇప్పటికే ప్రదర్శనలు ఇచ్చారు. అదే సాంకేతికతతో వరి వ్యర్థాల నుంచి ఉపయోగపడే కార్బన్ ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభించారు. ఐఐటీ అలూమ్ని అండ్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్, ఆచార్యులు మహేష్ పంచగ్నుల మాట్లాడుతూ... కొత్త పరిశోధనల ద్వారా పారిశ్రామిక రంగానికి ఎలా ఉపయోగకరంగా ఉంటుందో వివరించారు. ఐఐటీ మెటలర్జికల్, మెటీరియల్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టిజు థామస్ ఆధ్వర్యంలోని బృందం ప్రాజెక్టు పనులు చూస్తోంది. సీఎస్సార్ భాగస్వామ్యం వహిస్తే ప్రాజెక్టుతో దేశానికి ప్రయోజనం చేకూరే వీలుంటుందని థామస్ అన్నారు.
సూపర్ కెపాసిటర్ మాడ్యూల్ కోసం హార్డ్వేర్తో పరీక్ష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.