మెట్రో స్టేషనులో అదనపు వసతులు
మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ మెట్రో స్టేషనులో శుక్రవారం అదనపు వసతులను సీఎంఆర్ఎల్ ప్రవేశపెట్టింది.
బాలింతలకు ప్రత్యేక గది
వడపళని, న్యూస్టుడే: మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ మెట్రో స్టేషనులో శుక్రవారం అదనపు వసతులను సీఎంఆర్ఎల్ ప్రవేశపెట్టింది. 1, 2 ప్లాట్ఫారాల్లో అదనంగా రెండు ఎస్కలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. పలు మెట్రో స్టేషన్లలో అదనంగా 41 ఎస్కలేటర్లున్నాయి. అదేవిధంగా సెంట్రల్ మెట్రో స్టేషనుతో పాటు వడపళని, ఎగ్మూరు, పురట్చి తలైవి డాక్టర్ జయలలిత సీఎంబీటీ మెట్రో, వాషర్మెన్పేట మెట్రో స్టేషన్లలో మదర్ ఫీడింగ్ గదులు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్, వింకోనగర్ మెట్రో స్టేషన్లలో ఇప్పటికే ఫీడింగ్ గదులున్న విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన గదుల్లో కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, డైపర్లు మార్చుకునేందుకు సదుపాయం, ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేశారు. తల్లీబిడ్డల సంక్షేమం దృష్ట్యా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తుంటామని పేర్కొన్నారు.
కార్యదర్శికి వీడ్కోలు
గుమ్మిడిపూండి, న్యూస్టుడే: బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి గ్రామస్థులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. కొత్తగుమ్మిడిపూండి పంచాయతీ కార్యదర్శిగా చిట్టిబాబు ఆరేళ్లుగా పని చేశారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు పొందారు. ఆయన నేమలూరుకు బదిలీ కావడంతో శుభ్రత కార్మికులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?