logo

పదేళ్లలో అద్భుత ప్రగతి : గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

భారతదేశం పదేళ్లలో అద్భుత వృద్ధిని సాధించిందని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అన్నారు. తిరుచ్చిలోని ఓ ప్రైవేట్‌ కళాశాల సిల్వర్‌జూబ్లీ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు.

Updated : 11 Feb 2024 05:25 IST

మాట్లాడుతున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: భారతదేశం పదేళ్లలో అద్భుత వృద్ధిని సాధించిందని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అన్నారు. తిరుచ్చిలోని ఓ ప్రైవేట్‌ కళాశాల సిల్వర్‌జూబ్లీ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. కళాశాల మాజీ కార్యదర్శులు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను సత్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ కళాశాల అన్నింటిలా కాక ఆశ్రమం ద్వారా ఉత్తమంగా నడుస్తోందన్నారు. దేశానికి ఏమేం కావాలో అన్నింటినీ మోదీ చేస్తున్నారన్నారు. దేశాన్ని ప్రపంచం ఒక కుటుంబంగా చూస్తోందని తెలిపారు. జీ20 సదస్సు ద్వారా ఇండియా ప్రగతిని మోదీ చాటిచెప్పారన్నారు. భారత శాస్త్రవేత్తలు కరోనా టీకా కనుగొని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని