తెన్కాశిలో నెగ్గేదెవరు?
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు),
కుట్రాలం జలపాతం
ప్యారిస్, న్యూస్టుడే: పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), రాజపాళెయం శాసనసభ నియోజకవర్గాలతో ఏర్పాటైంది. 39 లోక్సభ స్థానాల్లో తెన్కాశి(రిజర్వు) 37వ నియోజకవర్గం.
వరుసగా తొమ్మిదిసార్లు..
ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. 1957 నుంచి 1991 వరకు వరుసగా తొమ్మిదిసార్లు ఆ పార్టీ విజయభేరి మోగించింది. ఆ పార్టీకి చెందిన అరుణాచలం వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. ఆ తర్వాత 1996లో జీకే మూపనార్ నేతృత్వంలోని టీఎంసీ గెలుపొందింది. ఈ పార్టీ తరఫున పోటీచేసిన అరుణాచలమే ఆరోసారి కూడా గెలుపొందారు. అనంతరం జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి అన్నాడీఎంకే, రెండుసార్లు సీపీఐ విజయం సాధించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి డీఎంకే గెలుపొందింది. డీఎంకే తరఫున పోటీచేసిన ధనుష్ ఎం.కుమార్ 4,76,156 ఓట్లు పొందారు. అన్నాడీఎంకే అభ్యర్థి అయిన పుదియ తమిళగం కట్చి అధ్యక్షుడు కృష్ణసామి కంటే 1,20,286 ఓట్లు అధికంగా పొందారు.
నలుగురి మధ్య తీవ్ర పోటీ..
డీఎంకే తరఫున ఈసారి ధనుష్ ఎం.కుమార్కు అవకాశం దక్కలేదు. శంకరన్కోవిల్కి చెందిన డాక్టర్ రాణి శ్రీకుమార్ను బరిలోకి దింపారు. వరుసగా ఆరుసార్లు పోటీచేసి పరాజయంపొందిన పుదియ తమిళగం కట్చి అధ్యక్షుడు కృష్ణసామి ప్రస్తుతం ఏడోసారి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షుడు జాన్పాండియన్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నామ్ తమిళర్ కట్చి తరఫున గతసారి పోటీచేసిన ఇసై మదివాణన్ను మళ్లీ నిలిపారు. స్వతంత్ర అభ్యర్థుల సహా మొత్తం 15 మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, ఎండీఎంకే, కమ్యూనిస్టులు, వీసీకేల బలాన్ని నమ్ముకుని డీఎంకే బరిలో ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రచారం చేశారు. పుదియ తమిళగం కట్చి అధ్యక్షుడు కృష్ణసామి, తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షుడు జాన్పాండియన్లు తమ కూటమి పార్టీల బలాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నారు. నెరవేరని హామీలు..
నియోజకవర్గంలోని చాలామందికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. శంకరన్కోవిల్లోని చేనేత పరిశ్రమపై ఆధారపడి పలువురు జీవనం సాగిస్తున్నారు. జలపాతాలకు పేరొందిన కుట్రాలంలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో పర్యాటకరంగం ఆ ప్రాంత ప్రజలకు చేయూతనిస్తుంది. కుట్రాలంను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం. జౌళి పార్కు ఏర్పాటు, పశ్చిమ కనుమల్లోని సెన్బగవల్లి చెక్డ్యామ్ మరమ్మతులు, వైద్య కళాశాల ఏర్పాటు తదితరమైనవి ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లుగా ఉన్నాయి. వాటిపై రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినా నెరవేరలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్ టమోటా సాస్లో పురుగులు
[ 30-04-2024]
నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు. -
సముద్రగర్భంలోకి కార్బన్ డయాక్సైడ్
[ 30-04-2024]
భూమిపై పేరుకుపోతున్న కార్బన్ డయాక్సైడ్ (ద్ని2) ముప్పు నుంచి తప్పించుకునే దారులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు భిన్న మార్గాల్లో అన్వేషిస్తుండగా..ఐఐటీ మద్రాస్ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. -
ఉత్తర తమిళనాడులో 1న తీవ్రమైన వేడి గాలులు
[ 30-04-2024]
ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. -
ప్రకాశ్రాజ్కు అంబేడ్కర్ చుడర్ అవార్డు: వీసీకే
[ 30-04-2024]
ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్కు 2024 ఏడాదికి అంబేడ్కర్ చుడర్ అవార్డు ఇవ్వనున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమాళన్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం
[ 30-04-2024]
విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు -
కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు సీఎం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
మరో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన లారెన్స్
[ 30-04-2024]
నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. -
పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం
[ 30-04-2024]
విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. -
రీ రిలీజ్కు సిద్ధంగా విజయ్ సేతుపతి సినిమాలు
[ 30-04-2024]
కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న