చిన్నారిపై పెంపుడు కుక్కల దాడి
పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది.
తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స
ముగ్గురి అరెస్టు
ఘటన జరిగిన కార్పొరేషన్ పార్కు
చెన్నై: పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. కుక్కల యజమాని, భార్య, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. థౌజండ్లైట్స్లోని మోడల్ స్కూల్ రోడ్డులో ఉన్న కార్పొరేషన్ పార్కుకు ఆదివారం సాయంత్రం రాట్వీలర్ జాతి కుక్కలతో అదే ప్రాంతానికి చెందిన పుగళేంది వచ్చాడు. అక్కడి ఓ గదిలో ఉన్న పార్కు కాపలాదారుడు రఘు కుమార్తె సుదక్ష(5)పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. శరీరంపై పలుచోట్ల కరిచాయి. తల, జుట్లు భాగాన్ని గట్టిగా కొరికి లాగేశాయి. ప్రత్యక్షంగా చూసిన పార్కులోని సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. తర్వాత ధైర్యం చేసి చిన్నారిని వాటి నుంచి రక్షించి ప్రభుత్వ ఆస్పత్రిల, తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాడిలో చిన్నారి తలపై జుట్లు సహా చర్మం కొంతభాగం వేరైంది. రఘు తన సమీప బంధువు మృతితో విళుపురం వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుమార్తెను కాపాడే సమయంలో సుదక్ష తల్లి సోనియా కూడా గాయపడింది.
గొలుసుల్లేవు..
కుక్కల యజమాని పుగళేంది అదే ప్రాంతంలో రక్తనిధి నిర్వహిస్తున్నాడు. రాట్వీలర్ జాతి కుక్కలతో సంతానాభివృద్ధి చేయించి వాటి పిల్లలను విక్రయిస్తున్నాడు. కుక్కల మెడకు గొలుసు వేయకుండా స్వేచ్ఛగా విడిచిపెట్టడంతో ఇప్పటికే స్థానికులు ఇద్దరిని కరిచినట్లు సమాచారం. పార్కుకు తీసుకొచ్చినప్పుడు కుక్కల మెడకు గొలుసులు లేవని తెలిసింది. పుగళేందిని దర్యాప్తు కోసం థౌజండ్లైట్స్ పోలీసులు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం ఆయన్ను అరెస్టు చేశారు. భార్య ధనలక్ష్మీ, కుమారుడు వెంకటేశన్నూ అరెస్టు చేశారు.
కింద పడి ఉన్న బెల్టు
చిన్నారికి వైద్యసాయం
బాధిత చిన్నారికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమని, అందుకయ్యే ఖర్చును కార్పొరేషన్ యంత్రాంగం భరించనుందని జీసీసీ కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్రప్రభుత్వం నిషేధించిన 23 కుక్కల జాతిలో రాట్వీలర్ కూడా ఒకటన్నారు. అలాంటి జాతి సంతానాభివృద్ధి కూడా చేయకూడదని తెలిపారు. లైసెన్సు లేకుండా రాట్వీలర్ కుక్కలను పుగళేంది పెంచుతున్నారని, కార్పొరేషన్ యంత్రాంగం నోటీసు పంపిందని పేర్కొన్నారు. ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచడానికి కచ్చితంగా లైసెన్సు తీసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురుషులకు ప్రత్యేక తిరునాల
[ 19-05-2024]
మదురై జిల్లా తిరుమంగళం సమీపం పెరుమాళ్ కోవిల్పట్టి గ్రామంలోని కరుంపారై ముత్తయ్య ఆలయంలో పురుషులు మాత్రమే పాల్గొనే తిరునాల శనివారం వైభవంగా జరిగింది. -
చిరుధాన్యం.. చక్కటి పోషకం
[ 19-05-2024]
సంప్రదాయ వంటకాల రుచే వేరు. వాటితో కలిగే ఆరోగ్యం.. అమోఘం. ఇప్పటికీ ఈ తరహా ఆహారం ముందంజలో ఉంటూ వస్తోంది. మారుతున్న ఆహార అలవాట్లు, సులువుగా దొరికే ఫాస్ట్ఫుడ్పై మోజు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాలు పాడవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. -
అవాస్తవ ప్రచారం తగదు: ముఖ్యమంత్రి స్టాలిన్
[ 19-05-2024]
విజయబాటలో ఇండియా కూటమి వెళ్తున్నందున ఓటమి భయంతో మోదీ అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. వెనుకబడిన, అణగారిన, షెడ్యుల్డ్ తెగల జీవితాల్లో వెలుగు నింపేందుకు 50శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కోరుతున్నాయన్నారు. -
కోవైలో కుండపోత
[ 19-05-2024]
కోయంబత్తూరులో శనివారం కుండపోత వర్షం కురిసింది. రహదారులు జలమయమవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలైన ఆలందురై, సెమ్మెడు, గౌండంపాళ్యంలో మోకాళ్ల లోతుకు నీరు చేరడంతో ఆ ప్రాంతవాసులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
కంచిలో జాతీయ సదస్సు
[ 19-05-2024]
కాంచీపురం సమీప ఏణాత్తూర్లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. -
ప్రధాని మోదీ బయోపిక్లో సత్యరాజ్?
[ 19-05-2024]
ప్రధాని మోదీ బయోపిక్లో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన నటించిన వెప్పన్ సినిమా ట్రైలర్ విడుదలైంది. -
రాధికను పరామర్శించిన శివకుమార్
[ 19-05-2024]
కాలుకు దెబ్బతగిలి కోలుకుంటున్న రాధికను సీనియర్ నటుడు శివకుమార్ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చేలా ఆయన గీసిన పెయింటింగ్స్ రాధికకు ఇచ్చారు. -
వైభవంగా వాసవి జయంతి మహోత్సవం
[ 19-05-2024]
జార్జిటౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం (ఎస్కేపీడీ)లో శనివారం నిర్వహించిన శ్రీ వాసవి జయంతి (వైశాఖ, శుక్ల, దశమి) మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తి, ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 19-05-2024]
శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. -
ఉద్యోగం పేరుతో నగదు మోసం
[ 19-05-2024]
చెన్నై వళసరవాక్కానికి చెందిన శరవణన్ భార్య సెంతమిళ్ అరిసి (31) ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతకసాగింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఉన్నట్లు వచ్చిన ప్రకటనలు చూసి అందులో ఉన్న ఫోన్ నెంబరుకి కాల్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!