ఇరాన్ నుంచి కొచ్చికి..
ఇరాన్ నుంచి తప్పించుకుని 3 వేల కి.మీ. సముద్రంలో ప్రయాణించి కేరళ సముద్రతీరానికి చేరుకున్న తమిళనాడు జాలర్లను కోస్ట్గార్డ్ రక్షించింది.
పడవలో వచ్చిన తమిళ జాలర్లు
కాపాడిన కోస్ట్గార్డ్ సిబ్బంది
ప్యారిస్, న్యూస్టుడే: ఇరాన్ నుంచి తప్పించుకుని 3 వేల కి.మీ. సముద్రంలో ప్రయాణించి కేరళ సముద్రతీరానికి చేరుకున్న తమిళనాడు జాలర్లను కోస్ట్గార్డ్ రక్షించింది. రామనాథపురానికి చెందిన దయాళన్, అరుణ్ దయాళన్, కలైదాస్, రాజేంద్రన్, మునీశ్వరన్, కన్నియాకుమరికి చెందిన మరియడేనియస్ తదితరులు 2023లో ఇరాన్కి ఒప్పంద కార్మికులుగా చేపలు పట్టేందుకు వెళ్లారు. వారికి యజమాని సయ్యద్ జావూద్ జాఫ్రియన్ వేతనం ఇవ్వకుండా బానిసలుగా చేసినట్లు తెలిసింది. వారు 15 రోజుల కిందట సయ్యద్ జావూద్ జాఫ్రిన్ పడవలో ఇరాన్ నుంచి అరేబియా సముద్రం వైపుగా ప్రయాణించి 5న కేరళ సముద్రతీరానికి వచ్చారు. పడవలో డీజిల్ అయిపోవడంతో నడి సముద్రంలో చిక్కుకున్నారు. బంధువులకు విషయం చేరవేశారు. వారు జాలర్ల సంఘాలతో మాట్లాడి ఇండియన్ కోస్ట్గార్డ్కు సమాచారం ఇచ్చారు. రెండు గస్తీ నౌకల్లో వెళ్లి జాలర్లను కాపాడి కొచ్చికి తీసుకొచ్చారు. కొచ్చి పోలీసుల దర్యాప్తు అనంతరం జాలర్లు మంగళవారం రాత్రి రామనాథపురానికి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.