విద్యార్థులకు ప్రతినెలా రూ.1000
ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతవిద్యకు వెళ్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1000 అందించే ‘తమిళ్ పుదల్వన్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్దాస్ మీనా తెలిపారు.
జులై నుంచి ‘తమిళ్ పుదల్వన్’ పథకం
సీఎస్ శివ్దాస్ మీనా
విద్యార్థినులతో మాట్లాడుతున్న శివ్దాస్ మీనా
చెన్నై, న్యూస్టుడే: ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతవిద్యకు వెళ్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1000 అందించే ‘తమిళ్ పుదల్వన్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శివ్దాస్ మీనా తెలిపారు. నగరంలోని అన్నా శతాబ్ది గ్రంథాలయం ప్రాంగణంలో చెన్నై జిల్లాకు చెందిన విద్యార్థుల కోసం ‘కల్లూరి కనవు’(కళాశాల కల) కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు మహోన్నత పాఠశాలల్లో 12వ తరగతి చదివిన విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. శివ్దాస్ మీనా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి మురుగానందం, ఇతర అధికారులు విద్యార్థులకు పలు సూచనలు అందించారు. శివ్దాస్ మీనా మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థుల హాజరు పెరిగిందన్నారు. ‘పుదుమై పెణ్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థినులకు ప్రతినెలా రూ.1000 అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థినుల సంఖ్య పెరిగిందన్నారు. ఉన్నత విద్యలో పలు అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘తమిళ్ పుదల్వన్’ పథకాన్ని జులై నుంచి ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
దిండుక్కల్కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.