logo

చింతలపాలెం చేరిన స్వాముల పాదయాత్ర

శబరిమలకు పాదయాత్రగా వెళుతున్న అయ్యప్ప స్వాములు శనివారం రాత్రి కశింకోట మండలం చింతలపాలెం గ్రామానికి చేరుకున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి రామచంద్రపురానికి చెందిన

Published : 06 Dec 2021 02:14 IST

పాదయాత్రగా వచ్చినవారికి స్వాగతం పలుకుతున్న స్థానిక స్వాములు

కశింకోట, న్యూస్‌టుడే: శబరిమలకు పాదయాత్రగా వెళుతున్న అయ్యప్ప స్వాములు శనివారం రాత్రి కశింకోట మండలం చింతలపాలెం గ్రామానికి చేరుకున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి రామచంద్రపురానికి చెందిన దేవులపల్లి నారాయణస్వామి, నలుగురితో కలిపి నవంబరు 29న కాలినడకన శబరిమల బయలుదేరారు. చింతలపాలెంలో వీరికి స్థానిక అయ్యప్ప స్వాములు జెర్రిపోతుల నూకునాయుడు తదితర బృందం స్వాగతం పలికి బస, పడి ఏర్పాటుచేశారు. ఆదివారం ఉదయం సాయిబాబా దర్శనం చేసుకొని తిరిగి పాదయాత్రను కొనసాగించారు. నారాయణస్వామి 33 సార్లు అయ్యప్ప మాలధారణ చేసి శబరిమల యాత్రకు వెళ్లారు. కాలినడకన వెళ్లడం ఇది మూడోసారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని