logo

ఎలమంచిలి సమస్యలను పరిష్కరించండి

ఎలమంచిలి పట్టణంలోకి వచ్చే కొక్కిరాపల్లి రైల్వేగేటు వద్ద పైవంతెన మిగులు పనులు పూర్తి చేయడానికి టెండర్లు పిలిచేలా ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, విశాఖ డెయిరీ వైస్‌ ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ కోరారు.

Published : 25 Jun 2022 05:56 IST

శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ని కలసిన

విశాఖ డెయిరీ వైస్‌ ఛైర్మన్‌ ఆనంద్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రమాకుమారి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి పట్టణంలోకి వచ్చే కొక్కిరాపల్లి రైల్వేగేటు వద్ద పైవంతెన మిగులు పనులు పూర్తి చేయడానికి టెండర్లు పిలిచేలా ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి, విశాఖ డెయిరీ వైస్‌ ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ కోరారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలిశారు. పట్టణ ప్రజలకు ప్రదాన సమస్యగా మారిన పైవంతెన పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని విన్నవించారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. భారీ తాగునీటి పథకంపై చర్చించారు. మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఛైర్‌పర్సన్‌ రమాకుమారి ముఖ్యమంత్రి జగన్‌కి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని