logo

జులై4న నల్ల బ్యాడ్జీలతో నిరసన

ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న భీమవరం పర్యటనకు వస్తున్న సందర్భంగా నల్ల జెండాలు, బ్యాడ్జీలతో కూర్మన్నపాలెంలోని ఉక్కు దీక్షా శిబిరంలో పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని తీర్మానించారు. ఇంటక్‌ కార్యాలయంలో ఇంటక్‌ అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు అధ్యక్షతన సోమవారం జరిగిన స

Published : 28 Jun 2022 06:53 IST

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న భీమవరం పర్యటనకు వస్తున్న సందర్భంగా నల్ల జెండాలు, బ్యాడ్జీలతో కూర్మన్నపాలెంలోని ఉక్కు దీక్షా శిబిరంలో పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని తీర్మానించారు. ఇంటక్‌ కార్యాలయంలో ఇంటక్‌ అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో పోరాట కమిటీ ఛైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, సీహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ ఆదివారం నిర్వహించిన మహా ప్రదర్శన విజయవంతం అయ్యిందన్నారు. ప్రైవేటీకరణపై మంగళవారం కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించాలని తీర్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని