logo

జీవీఎంసీ పట్టణ ప్రధాన ప్రణాళికాధికారిణిగా సునీత

మహా విశాఖ నగరపాలక సంస్థ పట్టణ ప్రధాన ప్రణాళికాధికారి బి.సురేష్‌కుమార్‌ను అమరావతిలోని డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌(డీటీసీపీ) కార్యాలయం అదనపు సంచాలకులుగా ప్రభుత్వం బదిలీ చేసింది.

Published : 02 Jun 2023 03:28 IST

వీఎంఆర్‌డీఏ సీయూపీగా సంజయ్‌ రత్నకుమార్‌

సునీత

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ పట్టణ ప్రధాన ప్రణాళికాధికారి బి.సురేష్‌కుమార్‌ను అమరావతిలోని డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌(డీటీసీపీ) కార్యాలయం అదనపు సంచాలకులుగా ప్రభుత్వం బదిలీ చేసింది. మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ గురువారం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల ప్రకారం డీటీసీపీలో అదనపు సంచాలకులుగా పనిచేస్తున్న వి.సునీతను జీవీఎంసీ పట్టణ ప్రధాన ప్రణాళికాధికారిణిగా నియమించారు. వీఎంఆర్‌డీఏ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌(సీయూపీ)గా విధులు నిర్వహిస్తున్న ఎ.ప్రభాకర్‌ను డీటీసీపీ కార్యాలయానికి బదిలీ చేసి ఏపీసీఆర్‌డీఏ అదనపు సంచాలకులుగా విధులు అప్పగించారు. జీవీఎంసీలో ఉప ప్రణాళికాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె.సంజయ్‌ రత్నకుమార్‌ను వీఎంఆర్‌డీఏ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌గా బదిలీ చేశారు.

* బుడా(బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట అథారిటీ) కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న డి.లక్ష్మి, శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట అథారిటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.రవణమ్మ, పార్వతీపురం కో-ఆపరేటివ్‌ అధికారి బి.సన్యాసినాయుడును మహా విశాఖ నగరపాలక సంస్థ యూసీడీ ప్రాజెక్టు అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని