ఆటల ప్రాజెక్టు.. అటకెక్కించిన జగన్..!
‘గమ్య నగరి’గా పేరుగాంచిన విశాఖలో భారీ సమీకృత క్రీడల ప్రాంగణం (ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్) నిర్మించాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలూ సిద్ధం చేసింది.
‘సమీకృత క్రీడా ప్రాంగణం’పై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం
స్థలాన్ని పరిశీలిస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు (పాత చిత్రం)
‘గమ్య నగరి’గా పేరుగాంచిన విశాఖలో భారీ సమీకృత క్రీడల ప్రాంగణం (ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్) నిర్మించాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలూ సిద్ధం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం క్రీడా మైదానం నిర్మాణానికి మోకాలడ్డింది. ఇక్కడే రాజధాని ఏర్పాటు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. క్రీడా మైదానానికి సహకరించకపోవడంతో క్రీడాకారుల ఆశలు ఆవిరయ్యాయి.
న్యూస్టుడే, అగనంపూడి:
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరహాలో సమీకృత క్రీడల ప్రాంగణం ఏర్పాటుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ మేరకు అధికారులు నగర పరిధిలో వివిధ చోట్ల స్థలాలు పరిశీలించారు.
- క్రీడా ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పనకు నాటి వుడా (ప్రస్తుతం వీఎంఆర్డీఏ) సహకారంతో సుమారు రూ.400 కోట్ల నిధులతో ప్రణాళికలు సిద్ధం చేశారు.
- ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు నిర్మించి క్రీడాకారులకు తర్ఫీదు ఇవ్వడానికి వీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. షాపింగ్ కోసం మల్టీఫ్లెక్స్లు నిర్మిస్తామన్నారు.
- అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహణకు మైదానాలను సిద్ధం చేసి, టెన్నిస్, బ్యాడ్మింటన్, షటిల్, హాకీ, బాక్సింగ్, కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్.. తదితర క్రీడాంశాలకు అవకాశం కల్పిస్తామన్నారు.
స్థలాల పరిశీలన
- తొలుత ఆనందపురం మండలం గండిగుండంలో 79 ఎకరాలు గుర్తించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాల కల్పనకు ఆ స్థలం సరిపోదని, సరైన రవాణా సౌకర్యాలు లేవని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అగనంపూడి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఖాళీ భూములు క్రీడా ప్రాంగణానికి అనుకూలంగా ఉంటాయని భావించారు. అవి ఉక్కు యాజమాన్యం ఆధీనంలో ఉండడంతో భూ బదలాయింపునకు నిర్ణయించారు.
- అగనంపూడిలోని 150 ఎకరాలను తీసుకుని, దానికి బదులుగా పెదగంట్యాడ మండలం పరిధిలో అంతే విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిని స్టీల్ప్లాంట్కు అప్పగించేలా కార్యాచరణ రూపొందించారు. దీంతో అప్పటి రాష్ట్ర యువజన, క్రీడా వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి అగనంపూడి, పెదగంట్యాడలో స్థలాలను పరిశీలించారు. విశాఖ ఎయిర్పోర్టుకు, దువ్వాడ రైల్వేస్టేషన్కు సమీపంలో ఉన్నందున అనుకూలంగా ఉంటుందని నిర్ధారించారు. అయితే ఉక్కు యాజమాన్యం నుంచి ఆమోదం లభించకపోవడంతో జాప్యం జరిగింది.
మరో ప్రతిపాన ఇలా..
ఆ తర్వాత గాజువాక, పరవాడ, సబ్బవరం మండలాల సరిహద్దు ప్రాంతం (ట్రైజంక్షన్)లో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మరో ప్రతిపాదన చేశారు. అధిక శాతం ప్రభుత్వ భూములు ఉన్నందున స్థలాల లభ్యత సులభమవుతుందని భావించారు. ఆయా భూములను కొందరు రైతులు సాగు చేస్తుండడంతో భూసమీకరణ చేపట్టారు. గ్రామ సభలు నిర్వహించి రైతుల ఆమోదం తీసుకున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే 2019 ఎన్నికలు రావడంతో పనులకు బ్రేకులు పడ్డాయి.
పట్టించుకోని వైకాపా...
2019 ఎన్నికల్లో వైకాపా గెలిచి అధికారంలోకి వచ్చాక క్రీడా మైదానాన్ని పక్కన పెట్టేసింది. అప్పటి వరకు జరిగిన భూసేకరణ పనులు నిలిచిపోయాయి. ఈ అయిదేళ్లలో క్రీడాప్రాంగణం ఊసే ఎత్తలేదంటే విశాఖ నగర అభివృద్ధిపై వైకాపా పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని క్రీడాకారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
పాలకుల నిర్లక్ష్యమే కారణం
విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా వేదిక లేకపోవడం పెద్ద లోటు. తెదేపా ప్రభుత్వ ప్రతిపాదనను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్లి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. క్రీడాకారులు నైపుణ్యం పెంచుకుని అంతర్జాతీయ పోటీల్లో రాణించే అవకాశం ఉండేది. వైకాపా పాలకుల నిర్లక్ష్యం.. క్రీడాకారులకు శాపంగా మారింది.
కె.పెంటారావు, అగనంపూడి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
[ 18-05-2024]
విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలని చెప్పి.. చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయి
[ 18-05-2024]
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయని ఉత్తర నియోజకవర్గం భాజపా (కూటమి) ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. బర్మాక్యాంపు ప్రాంతంలో ఓ కుటుంబంపై దాడి ఘటనపై శుక్రవారం సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
5,56,819 మంది పోలింగ్కు దూరం
[ 18-05-2024]
విశాఖ పార్లమెంట్ పరిధిలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ అయిదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని 5 లక్షలకు పైగా ఓటర్లు జారవిడుచుకున్నారు. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోలేదు. -
కోడికత్తి కేసు వాయిదా
[ 18-05-2024]
కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. -
వేసవి క్రీడా శిబిరాలు ఉన్నట్టా.. లేనట్టా..!
[ 18-05-2024]
పాఠశాల స్థాయి విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై ఈ ఏడాది మహా విశాఖ నగరపాలక సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు శిబిరాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
నేడు నిర్మాల్య చందనం విక్రయాలకు విరామం
[ 18-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిర్మాల్య చందనం విక్రయానికి శనివారం విరామం ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
దాడి పూర్వాపరాలపై డీసీపీ ఆరా
[ 18-05-2024]
తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. -
వేడి నీటిలోకి జారిపడ్డ ఉక్కు కార్మికుడు
[ 18-05-2024]
విశాఖ ఉక్కు కర్మాగారంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మాగారంలోని కోకోవెన్ బ్యాటరీ-3లో సెమీ స్కిల్డ్ వర్కర్గా పని చేస్తున్న జె.సాంబయ్య (55) ఉదయం జనరల్ షిఫ్ట్కు వెళ్లాడు. -
వైజాగ్ కన్వెన్షన్లో మెగా కన్జ్యూమర్ ఎక్స్పో
[ 18-05-2024]
పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. -
ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తన్వి రిషిక
[ 18-05-2024]
ఇటీవల కేరళలో జరిగిన జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచిన నగరానికి చెందిన తన్వి రిషికను విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. -
అమ్మవారి పండగపై పోలీసుల ఆంక్షలు
[ 18-05-2024]
కొమరవోలు గ్రామదేవత అయిన కొమరవోలు తల్లి పండగ ఈసారి పోలీసు ఆంక్షలతో సాదాసీదాగా సాగింది. ఈ పండగ మూడేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. -
పాడేరు మోదకొండమ్మ జాతర 9 నుంచి
[ 18-05-2024]
ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. -
నాలుగు రోజులు చిరుజల్లులు
[ 18-05-2024]
జిల్లాలో మరో నాలుగు రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం వాతావరణ అధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. -
వాహన లైటింగ్తో వేగాన్ని తేల్చేలా..
[ 18-05-2024]
టెలి కమ్యూనికేషన్ డే సందర్భంగా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నూతన టెక్నాలజీ లైఫై ప్రాజెక్టును రూపొందించారు. కాంతి మార్గం ద్వారా మనం అందించే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేలా దీన్ని తయారుచేశారు. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM