logo

కూటమితో పిల్లలకు బంగారు భవిత

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

Published : 06 May 2024 03:00 IST

మహిళలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న కొణతాల

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని వేల్పులవీధిలో ఆదివారం కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొణతాల ముందుగా గౌరీపరమేశ్వరులను దర్శించుకుని ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు ఇచ్చారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. చిన్నారి సైకిల్‌పై ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సీతారామ కల్యాణ మండపం వద్ద జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

జబర్దస్త్‌ నటుల ప్రచారం

ఇంటింటా ప్రచారంలో గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేయాలని గుర్తును చూపిస్తున్న షకలక శంకర్‌,  అప్పారావు

అనకాపల్లి,  లక్ష్మీదేవిపేట, కొత్తూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని పలు ప్రాంతాల్లో జబర్దస్త్‌ నటులు షకలక శంకర్‌, అప్పారావు ఆదివారం పర్యటించారు. దేమునిగుమ్మం, గొల్లవీధి, వేంకటేశ్వరస్వామి కోవెల రోడ్డు, దిబ్బపాలెం తదితర ప్రాంతాల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌లకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పత్రాలు పంపిణీ చేశారు. వ్యాపారుల వద్దకు వెళ్లి  గాజుగ్లాసు, కమలం గుర్తులను చూపించి ఉత్సాహంగా ప్రచారం చేశారు. పలువురు వీరితో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని